గానకోకిలగా పేరుగాంచిన లతా మంగేష్కర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో భాషల్లో అనేక పాటలను పాడారు. సెప్టెంబర్ 28, 1929లో ఇండోర్ లో జన్మించిన ఆమె ఫిబ్రవరి 6, 2022లో కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. అయితే ఆమె హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నప్పుడు ఆమె చెప్పిన చివరి మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మాటలు అందరినీ ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. ఆమె తన అంతిమ ఘడియల్లో చెప్పిన మాటలు ఇవే..
లోకంలో మరణాన్ని మించిన సత్యం మరేది లేదు. అత్యంత విలువైన బ్రాండెడ్ కార్లు నా ఇంటి గేరేజ్లో ఉన్నాయి. నేను చక్రాల కుర్చీలో తిరుగుతున్నాను. విలువైన వస్త్రాలు, విలువైన అలంకార సాధనాలు, విలువైన రకరకాల పాద రక్షలు అమూల్యమైన వస్తువులన్నీ నా ఇంట్లో పడి వున్నాయి. కాని ఆస్పత్రిలో వారు ఇచ్చిన చిన్న గౌన్ వేసుకుని వున్నాను నా బ్యాంకు అక్కౌంట్ లో డబ్బు చాలానే వుంది. కాని నాకు ఏదీ ఉపయోగం లేదు ఇప్పుడు నా ఇల్లు ఒక రాజభవనంలా వుంది. కాని నేను ఆస్పత్రిలో ఒక చిన్న బెడ్ మీద వున్నాను. ప్రపంచంలో వున్న ఫైవ్ స్టార్ హోటల్స్ అన్నింటికి ప్రయాణం చేసేదాన్ని. ఆస్పత్రిలో ఆ టెస్టుకి ఈ టెస్టుకీ లేబ్లకు మారి మారీ వెళుతున్నాను.
ఆనాడు నిత్యం శిరోజాలంకరణలవారు వచ్చి శిరోజాలు అలంకరించేవారు. ఈనాడు నాకు శిరసు పై శిరోజాలే లేవు. ప్రసిద్ధి చెందిన హోటల్స్ లోని ఆహారం తింటూ వుండేదానిని. కాని ఈనాడు పగలు రెండు మాత్రలు, రాత్రి ఒక చిటికెడు ఉప్పు . ప్రత్యేక జెట్ విమానాల్లో ప్రపంచం అంతా తిరిగేదాన్ని. కాని నేడు ఆస్పత్రి వరండా దాకా వెళ్ళడానికి ఇద్దరు అటెండర్లు సాయం చేస్తున్నారు. ఏ సంపదా, వసతులు ఏవీ నాకు సహాయ పడలేదు. ఏ విధమైన ఓదార్పునివ్వ లేదు కాని కొంతమంది ఆత్మీయుల ఆత్మీయత, ఆప్యాయత, వారి ప్రార్ధనలు…. నాకు జీవం పోస్తున్నాయి. ఇంతేనండి ఈ జీవితం… ఎవరికీ సహాయం చేయలేని ధనం వేస్ట్. పదవి వున్న వారికే విలువ ఇవ్వకండి. మంచి మనసు వున్న వారికి విలువనిచ్చి ,స్నేహం, ఆప్యాయత, ప్రేమను చూపించండి..