కల్లు లో మత్తు సహజంగా ఉంటుందా? దానిలో మత్తుమందు కలుపుతారా? మత్తునిచ్చే కల్లు తాగడం ఆరోగ్యానికి నష్టమా? లాభమా? పులిసిన కల్లులో 4–8% ఎథనాల్ ఉంటుంది. ఇది మత్తును కలిగిస్తుంది. కల్లు 3 రకాల చెట్ల నుండి తీస్తారు. తాటి చెట్టు, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు. కల్లు పూలవక ముందు వచ్చే తీయటి రసాన్ని నీరా (Neera) అంటారు. దీన్ని ఎనర్జీ డ్రింక్ అనుకోవచ్చు. దీంట్లో తక్కువ కాలరీలు (పులిసిన కల్లుతో పోలిస్తే) B1, B2, B12, C విటమిన్స్, పొటాషియం, ఐరన్, మాంగనీస్, జింక్ లాంటి మినరల్స్, కొంచెం తక్కువ ప్రోబయోటిక్స్(పులిసిన కల్లు తో పోలిస్తే) , అధికంగా గ్లూకోజ్, ఫ్రుక్టోజ్ ఉంటాయి.
నీరా పులిస్తే (Fermentation) కల్లు అవుతుంది, దీన్లో ఉండే చక్కెరను అందులో సహజంగా ఉండే ఈస్ట్ సూక్ష్మజీవులు ఎథనాల్ (alcohol) గా మారుస్తాయి. ఎంత కాలం పులియబెడితే అంత alcohol శాతం పెరుగుతుంది. సేకరించిన మొదటి గంటలోపు తాగితే పూలవకుండా ఉంది స్వీట్ గా ఉంటుంది. నాలుగు గంటలు వదిలేస్తే కల్లు గా రూపాంతరం చెందుతుంది. కల్లు అమ్మేవారి దగ్గర 100% స్వచ్ఛమైన కల్లు దొరకడం దాదాపు అసాధ్యం.
వారు కల్లును డైల్యూట్ చేసి మత్తును పెంచడానికి sleeping pills (diazepam, alprazolam) లాంటి టాబ్లెట్స్ లను కలుపుతారు. ఇవి మత్తును పెంచి కల్లు తాగడం వ్యసనంగా మారుస్తాయి. లివర్ పాడు అయిపోతుంది. కొన్ని సార్లు ప్రాణం కూడా పోవచ్చు. కాబట్టి మీకు ఆరోగ్యంగా ఉండాలంటే నీరా తాగండి. నేను బెంగళూరు, హైదరాబాద్లో నీరా పార్లర్ లు చూసాను.