యయాతిని చంపాలని.. విశ్వామిత్రుడిని రాముడు ఆదేశించాడు. అప్పుడు యయాతి హనుమంతుడిని సహాయం కోరాడు. అప్పుడు హనుమంతుడు తాను ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా రక్షిస్తానని యయాతికి వాగ్ధానం చేశాడు. అయితే ఈ సంగ్రామంలో హనుమంతుడు ఎలాంటి ఆయుధం ఉపయోగించలేదు. కేవలం రామనామం జపిస్తూ కూర్చున్నాడు. రామబాణాలు హనుమంతుడి దగ్గరకు వచ్చినా.. అవి ఎలాంటి హాని చేయలేదు. అలా హనుమంతుడు రాముడిపై విజయం సాధించాడు. సీతను కలవడానికి హనుమంతుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లినప్పుడు తనకు సీతమ్మ వండిన ఆహారం తినాలనే కోరిక ఉందని చెప్పాడు. అప్పుడు సీతాదేవి రకరకాల వంటకాలను వండి హనుమంతుడికి వడ్డించింది. కానీ.. హనుమంతుడికి ఆకలి మాత్రం తగ్గలేదు.. ఆశ్రమంలో ఉన్న సరుకులన్నీ అయిపోవచ్చాయి. అప్పుడు సీతాదేవి రాముడిని ప్రార్థించగా.. రాముడు తులసీదళం వడ్డించడం వల్ల.. హనుమంతుడి ఆకలి తగ్గుతుందని చెప్పగా.. హనుమంతుడి ఆకలి తీరింది.
హనుమంతుడి వివిధ రూపాల్లో.. పంచముఖిగా దర్శనమిస్తాడు. రావనాసురుడి సోదరుడైన అహిరావన్ ను రాముడు, లక్ష్మణుడు అపహరిస్తారు. అహిరావన్ ని సంహరించడానికి ఒకే ఒక మార్గం ఉంది. అది 5 దీపాలు, 5 మార్గాల్లో తీసుకెళ్లాలి. అప్పుడు హనుమంతుడు తన రూపంతో పాటు, నరసింహ, గరుడ, వరాహ, హయగ్రీవుడిగా 5 మార్గాల్లో వెళ్లాడు. రాముడు చనిపోవడానికి హనుమంతుడు అంగీకరించలేదు. అయోధ్యలోకి యముడు ప్రవేశించకుండా అడ్డుకున్నాడు. దీంతో హనుమంతుడిని మళ్లించాలని భావించిన రాముడు తన చేతి ఉంగరాన్ని కిందకు పడేస్తాడు. దాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని ఆదేశిస్తాడు రాముడు. ఉంగరం కోసం వెళ్లిన హనుమంతుడికి సర్పాలదీవికి చేరుకున్నాడు. ఇలా రాముడు తన బంటుని పక్కకు పంపి.. తన ప్రాణాలు కోల్పోయాడు.
హనుమంతుడిని యుద్ధంలో ఏ ఆయుధంతోనూ ఎవరూ చంపలేని వరం బ్రహ్మదేవుడు ప్రసాదించాడు. అలాగే దీర్ఘాయుష్సు, ఆధ్మాత్మిక చింతన, సముద్రం దాటే ధైర్యాన్ని శివుడు ప్రసాదించాడు. ఆంజనేయస్వామికి పంచభూతాల అనుగ్రహం కూడా ఉంది. వరుణుడు నీటితో రక్షిస్తానని, అగ్ని దేవుడు ఎప్పటికీ.. అగ్నికి ఆహుతికావని, సూర్యడు అతిపెద్ద, అతి చిన్న రూపాల్లో మారే శక్తిని, వాయు దేవుడు ఎక్కువ వేగంతో వెళ్లగలిగే శక్తిసామర్థ్యాలను, యముడు ఆరోగ్యవంతమైన జీవితం, అలాగే తన యమపాశం నుంచి విముక్తిని ప్రసాదిస్తాడు. అంటే తన ద్వారా హనుమాన్ కి మరణం ఉండదని అనుగ్రహిస్తాడు. భీముడి సోదరుడిగా హనుమంతుడిని చెబుతారు. వీళ్లద్దరికి తండ్రి ఒక్కరే వాయు దేవుడు. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో తనతో పాటు హనుమంతుడు ఉన్నాడని.. అర్జునుడు చెబుతాడు. చివరికి తాను తీసుకొచ్చిన జెండాలో హనుమంతుడు ఉన్నాడని వివరిస్తాడు. యుద్ధం తర్వాత హనుమంతుడు తన నిజరూపంలోకి వస్తాడు. హనుమంతుడు కిందకు దిగగానే అర్జునుడి వాహనం కాలిపోతుంది. అంటే.. ఎప్పుడో కాలిపోవాల్సిన వాహనాన్ని హనుమంతుడే రక్షించాడని.. కృష్ణుడు వివరిస్తాడు.