Dondakaya Curry : దొండ‌కాయ క‌ర్రీని ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Dondakaya Curry : దొండకాయ మ‌సాలా క‌ర్రీ.. దొండ‌కాయ‌ల‌తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. త‌రుచూ కూర‌, వేపుడు వంటి వాటినే కాకుండా దొండ‌కాయ‌ల‌తో ఇలా మ‌సాలా క‌ర్రీని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ క‌ర్రీని దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. దొండ‌కాయ‌లను తిన‌ని వారు కూడా ఈ క‌ర్రీని ఇష్టంగా తింటారు. దొండ‌కాయ మ‌సాలా క‌ర్రీని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వెరైటీ రుచుల‌ను కోరుకునే వారు ఇలా దొండ‌కాయ‌ల‌తో మ‌సాలాకూర‌ను త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దొండ‌కాయ‌ల‌తో రుచిగా మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దొండకాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దొండ‌కాయ‌లు – పావుకిలో, నూనె – 5 టేబుల్ స్పూన్స్, నాన‌బెట్టిన చింత‌పండు – 2 రెమ్మ‌లు, బిర్యానీ ఆకు – 1, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ప‌చ్చిమిర్చి – 3, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ – 1, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, త‌రిగిన ట‌మాట – 1, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నీళ్లు – ఒక‌టింపావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Dondakaya Curry recipe make in this method
Dondakaya Curry

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌ల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 3, యాల‌కులు – 4, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీడిప‌ప్పు – 5.

దొండకాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో ప‌ల్లీలు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత మిగిలిన ప‌దార్థాలు వేసి వేయించాలి. దినుసుల‌న్నీ వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే నాన‌బెట్టిన చింత‌పండు వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత దొండ‌కాయ అంచుల‌ను తీసేసి గుత్తి వంకాయ‌లుగా క‌ట్ చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక దొండకాయ‌లను వేసి వేయించాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ దొండ‌కాయ‌ల‌ను వేయించాలి. దొండ‌కాయ‌లు వేగి కొద్దిగా రంగు మారిన త‌రువాత వీటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇదే నూనెలో బిర్యానీ ఆకు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్క‌లు, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి మెత్త‌గా అయ్యే వర‌కు వేయించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, కారం, ఉప్పు వేసి క‌ల‌పాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మ‌సాలాలు మాడిపోకుండా వేయించుకోవాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు ఉడుకుప‌ట్టిన త‌రువాత వేయించిన దొండ‌కాయ‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ 8 నిమిషాల పాటు ఉడికించాలి. దొండ‌కాయ‌లు ఉడికి నూనె పైకి తేలిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దొండ‌కాయ మసాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, రోటీ, జీరా రైస్, బ‌గారా అన్నం వంటి వాటితో తింటే చాలారుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts