Kaju Masala Gravy : రైస్, బిర్యానీ, రోటీలోకి.. రెస్టారెంట్ రుచితో కాజు మసాలా గ్రేవీ.. త‌యారీ ఇలా..!

Kaju Masala Gravy : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే మ‌సాలా కూర‌ల‌లో కాజు మ‌సాలా గ్రేవీ కూడా ఒక‌టి. జీడిప‌ప్పుతో చేసే ఈ మ‌సాలా కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. దేనితో తిన్నా కూడా ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కాజు మ‌సాలా కూర‌ను అదే రుచితో మనం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎవ‌రైనా కూడా దీనిని సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే కాజు మ‌సాలా గ్రేవీని రెస్టారెంట్ స్టైల్ లో ఎలా త‌యారు చేసుకోవాలి..అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కాజు మ‌సాలా గ్రేవీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు ప‌లుకులు – 1/3 క‌ప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, జీల‌కర్ర -ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ తరుగు – ముప్పావు క‌ప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, కారం – రెండు టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Kaju Masala Gravy recipe in telugu make in this way
Kaju Masala Gravy

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, అల్లం – ఒక ఇంచు ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు – 6, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, పెద్ద ముక్కలుగా త‌రిగిన పెద్ద ట‌మాట – 1, ప‌సుపు – పావు టీ స్పూన్.

కాజు మ‌సాలా గ్రేవీ త‌యారీ విధానం..

ముందుగా జీడిప‌ప్పును గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత అవి మునిగే వ‌ర‌కు త‌గిన‌న్ని నీళ్లు పోసి రెండు గంట‌ల పాటు నాన‌బెట్టాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన త‌రువాత జీడిప‌ప్పు, ప‌సుపు, టమాట ముక్క‌లు వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు వేగిన త‌రువాత స్టవ్ ఆఫ్ చేసి చ‌ల్లార‌నివ్వాలి. త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పేస్ట్ లాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌ల‌ను గోల్డెన్ బ్రౌన్ క‌ల‌ర్ వ‌చ్చే వ‌ర‌కు వేయించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు మ‌ధ్య‌స్థ మంట‌పై క‌లుపుతూ వేయించాలి.

త‌రువాత నాన‌బెట్టుకున్న జీడిప‌ప్పును నీటితో స‌హా వేసుకోవాలి. త‌రువాత గ్రేవీకి త‌గినన్ని నీళ్లు పోసుకుని క‌ల‌పాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత బ‌ట‌ర్, క‌సూరి మెంతి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని 2 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాజు మ‌సాలా గ్రేవీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, పులావ్, బిర్యానీ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా కాజుతో మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts