Paneer Bhurji : ప‌నీర్‌తో ఎంతో రుచిక‌ర‌మైన బుర్జీ క‌ర్రీ.. ఇలా చేస్తే చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Paneer Bhurji : మ‌నం ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది. ప‌నీర్ తో సుల‌భంగా చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌నీర్ బుర్జీ కూడా ఒక‌టి. ఇది ఎక్కువ‌గా ధాబాల‌ల్లో ల‌భిస్తూ ఉంటుంది. చ‌పాతీ, రోటీ, నాన్ వంటి వాటిలోకి ఈ క‌ర్రీ చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ ప‌నీర్ బుర్జీని మ‌నం కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. ఎవ‌రైనా చాలా తేలిక‌గా, చాలా త‌క్కువ స‌మ‌యంలో దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ బుర్జీని ఎలా త‌యారు చేసుకోవాలి.. తయారీకి కావ‌ల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్ బుర్జీ క‌ర్రీ తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ముప్పావు క‌ప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, శ‌న‌గ‌పిండి – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ట‌మాట ముక్క‌లు – ముప్పావు క‌ప్పు, ప‌సుపు – పావు టీస్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్స్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మసాలా -అర టీ స్పూన్, క‌సూరిమెంతి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ప‌నీర్ – 150 గ్రా., ప్రెష్ క్రీమ్ – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Paneer Bhurji recipe very tasty with chapati
Paneer Bhurji

ప‌నీర్ బుర్జీ క‌ర్రీ తయారీ విధానం..

ముందుగా ప‌నీర్ ను తురుముకోవాలి లేదా చేత్తో మెత్త‌గా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు ఎర్ర‌గా వేగిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. త‌రువాత శ‌న‌గ‌పిండి వేసి మాడిపోకుండా వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, ఉప్పు, ప‌సుపు, కారం వేసి క‌ల‌పాలి. ఇప్పుడు వీటిపై మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డే వ‌రకు వేయించాలి.

ట‌మాట ముక్క‌లు మ‌గ్గిన త‌రువాత ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి, గ‌రం మ‌సాలా, క‌సూరిమెంతి వేసి క‌ల‌పాలి. వీటిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత నీళ్లు పోసి క‌ల‌పాలి. నీళ్లు ఉడుకు ప‌ట్టిన త‌రువాత ప‌నీర్ వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌, ఫ్రెష్ క్రీమ్ వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పనీర్ బుర్జీ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ప‌నీర్ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts