Paneer Kaju Masala Curry : ప‌నీర్‌, జీడిప‌ప్పు వేసి ఇలా మ‌సాలా క‌ర్రీని చేయండి.. రోటీల్లోకి ఎంతో బాగుంటుంది..

Paneer Kaju Masala Curry : పాల‌తో త‌యారు చేసే ప‌దార్థాల్లో ప‌న్నీర్ ఒక‌టి. దీనితో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. ప‌న్నీర్ తో చేసే ఏ వంట‌క‌మైన చాలా రుచిగా ఉంటుంది. ప‌న్నీర్ తో చేసుకోద‌గిన వివిధ ర‌కాల వంట‌కాల్లో ప‌న్నీర్ కాజు మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి. ఈ వంట‌కాన్ని మ‌న‌లో చాలా మంది రుచి చూసే ఉంటారు. ఈ కూర‌ను త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. వంట‌రాని వారు, మొద‌టిసారి చేసే వారు కూడా ఈ కూర‌ను సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ప‌న్నీర్ కాజు మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌న్నీర్ కాజు మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌న్నీర్ – 200 గ్రా., జీడిప‌ప్పు – అర‌ కప్పు, ట‌మాట ఫ్యూరీ – అర క‌ప్పు, చిన్న‌గా త‌రిగిన పెద్ద ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, జీడిప‌ప్పు పేస్ట్ – పావు క‌ప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 2, యాల‌కులు – 2, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Paneer Kaju Masala Curry recipe in telugu make in this way very easy
Paneer Kaju Masala Curry

ప‌న్నీర్ కాజు మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీడిప‌ప్పును వేసి వేయించాలి. జీడిపప్పు చ‌క్క‌గా వేగిన త‌రువాత వాటిని ప్లేట్ లోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. త‌రువాత అదే నూనెలో బ‌ట‌ర్ వేసి వేడి చేయాలి. బ‌ట‌ర్ కూడా వేడ‌య్యాక దాల్చిన చెక్క‌, ల‌వంగాలు, యాల‌కులు వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ఉప్పు వేసి క‌లపాలి. ఉల్లిపాయ ముక్క‌లను ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ప‌సుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత ట‌మాట ఫ్యూరీ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత జీడిప‌ప్పు పేస్ట్ వేసి క‌లుపుతూ నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత వేయించిన జీడిప‌ప్పు, ప‌న్నీర్ వేసి క‌ల‌పాలి.

త‌రువాత అర గ్లాస్ నీళ్లు, క‌సూరి మెంతి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ ఉడికించాలి. చివర‌గా కొత్తిమీర చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌న్నీర్ కాజు మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. వీటిని చ‌పాతీ, రోటీ, బ‌ట‌ర్ నాన్, బిర్యానీ, పులావ్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. చ‌పాతీ, రోటి, నాన్ వంటి వాటిని త‌యారు చేసుకున్న‌ప్పుడు ఇలా ప‌న్నీర్ తో మ‌సాలా కూర‌ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఇంకా కావాల‌ని అడిగి మ‌రీ ఈ కూర‌ను ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts