హిందూ సంప్రాదాయాలు ప్రకారం కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచితే మంచి ఫలితాలు ఉంటాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కొన్ని వస్తువులను ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల చాలా శుభం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాన ద్వారం వద్ద ఉంచడం వల్ల ఇంట్లో సుఖ సంపదలు లభిస్తాయట. ఇంటి గుమ్మానికి అంటే ప్రధాన ద్వారానికి తోరణం పెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై మామిడి, రావి, అశోక, ఆకులతోపాటు చివర్ల వేప రెమ్మలను కూడా పెడతారు.
అలాగే బంతిపూల మాలను కూడా కడతారు. అయితే ఈ ఆకులు ఎండిపోయినపుడు మీరు వాటిని తీసేసి.. మళ్ళీ కొత్తగా తోరణాలను కట్టుకోవచ్చు.. గుమ్మానికి రెండు వైపులా శుభ ప్రదమైన గుర్తుని వేయడం మంచిదని భావిస్తారు. ఇది ప్రతికూలత, చెడు నుండి మనల్ని రక్షిస్తుందని నమ్మకం. దీపావళి పూజ సమయంలో ఇంట్లో లక్ష్మీ దేవి పాదాలను ఉంచడం శభశకునంగా భావిస్తుంటారు. వాస్తు శాస్త్రు ప్రకారం మీరు ఇంటి ప్రధాన ద్వారం మీద లక్ష్మీ పాదాల గుర్తులను వేసుకోవచ్చు. ఇది ఇంట్లో సంపద, సంతోషాన్ని సూచిస్తుంది. స్వస్తిక్ చిహ్నం హిందూ మతంలో ప్రతి పనిని ప్రారంభించే ముందు కుంకుమ, గంధాన్ని ఉపయోగిస్తారు.
అంతేకాదు..ఇంటి ప్రధాన ద్వారం వద్ద అంటే గడపకు ఏదురుగా పైన ఉండే దానికి వినాయకుడిని బొమ్మను చెక్కుతారు. వినాయకుడి ప్రతిమ లేని గడప ఉండడం మనం ఎక్కువగా చూడలేం. అలాగే వారంలో మనం కల్లాపి చల్లిన ప్రతి సారి గడపను కూడా శుభ్రంగా కడుక్కొని పసుపు, కుంకుమలతో కచ్చితంగా ముగ్గు పెట్టాలి. అలా చేస్తే లక్ష్మీ దేవి మన ఇంటికి వచ్చేందుకు ఇష్టపడుతుంది. ఇల్లు, చుట్టూ ఉండే పరిసరాలు ఎంత నీట్గా ఉంటే మన ఇంట్లో లక్ష్మీ దేవి ఉండటానికి ఇష్ట పడుతుందని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. వీలైతే ప్రతిరోజూ దీపారాధన చేయండి. అలా వీలు కాని వారు వారంలో రెండు, మూడు రోజులైన సరే దేవుడి ముందు దీపం పెట్టాలి.