మన దేశంలో పెరుగుతున్న జనాభా, దానితో పాటే పెరుగుతున్న మోటార్ వెహికల్స్, అవి విడుదల చేస్తున్న కాలుష్యం వల్ల మనిషి ఆరోగ్యం చెడిపోతుంది. చెట్లను నరికి వేయడం, పరిశ్రమల నుంచి విడుదల అయ్యే రసాయనాల వల్ల వాయు కాలుష్యం రోజు రోజుకీ పెరిగి పోతోంది. దీనితో అనేక రకాల శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నాయి. వీటికి తోడు చెడు వ్యసనాలకు బానిసలు అవడం వల్ల కూడా మన ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లుతోంది. అయితే దీనికి పరిష్కారం మన ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే కొంత వరకు వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు.
పూర్వం నుండి మనం తీసుకునే ఆహారమే ఎన్నో వ్యాధులకు మంచి ఔషధంగా పనిచేస్తోంది. అయితే వీటిలో మన ఊపిరితిత్తులకు వ్యాధులు సోకకుండా ఉంచే ఆహారాలు చాలా ఉన్నాయి. ఊపిరితిత్తులను శుభ్ర పరచుకోవడం వల్ల రకరకాల ఇన్ఫెక్షన్ ల నుండి కాపాడతాయి. సి విటమిన్ ఎక్కువగా ఉండే ఆరెంజ్ లు, నిమ్మ, బత్తాయి వంటివి మనకు కావలసిన ఆక్సిజన్ గ్రహించేలా చేస్తాయి. అలాగే దానిమ్మ పళ్ళను తినడం వల్ల ఊపిరితిత్తుల్లో ఉండే కణతులను నివారించటానికి దోహదం చేస్తాయి.
పొగతాగే వారు ఉల్లిని ఎక్కువగా వాడటం మంచిది. రోజుకి 300ml పైనాపిల్ జ్యూస్ తాగాలి. అలాగే విటమిన్ ఇ, బి, ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే పాలు, పాల పదార్థాలను సాధ్యమైనంతవరకు దూరం పెట్టాలి. వీటిలో కొన్ని రకాల ఎంజైములు ఊపిరితిత్తులకు నష్టం కలిగిస్తాయి. ఏది ఏమైనా కాలుష్యం నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.