మీనాక్షి చౌదరి, భారతీయ చలనచిత్ర నటి. మీనాక్షి చౌదరి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆమె ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పనిచేసింది. మీనాక్షి చౌదరి 2021 సంవత్సరంలో సుశాంత్ సరసన దర్శకుడు ఎస్.దర్శన్ తీసిన ఇచట వాహనం నిలపరాదు సినిమా ద్వారా తన టాలీవుడ్ పరిశ్రమలోకి రంగ ప్రవేశం చేసింది. అయితే, అడవి శేష్ తో ఆడి పాడి హిట్ 2 సినిమాతో హిట్ కొట్టిన మీనాక్షి చౌదరి బ్యాక్ గ్రౌండ్ ఏంటో చూద్దాం.
నువ్వు నమ్మితే అన్ని సాధ్యమే అన్నమాట మీనాక్షి చౌదరికి అక్షరాల వర్తిస్తుంది. ఈ అందాల భామ స్వస్థలం హర్యానా. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా జీవితంలోని ప్రతి మార్గంలో విజయాన్ని అందుకోవడానికి కృషి చేసింది. ఆమె డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీ ని అభ్యసించింది. అందాల పోటీల్లో పాల్గొని ప్రిన్సెస్ 2018 లో కిరీటాన్ని గెలుచుకుంది. ఈ విజయంతో ఫెమినా మిస్ ఇండియా గ్రాండ్ ఫినాలే కి నేరుగా ప్రవేశం పొందింది.
అంతర్జాతీయ పోటీలలో పాల్గొని భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. వెబ్ సిరీస్ తో తన నటన రంగప్రవేశం చేసింది. అవుట్ ఆఫ్ లవ్, BBC డ్రామా సిరీస్ చేసింది. ఇచట వాహనం నిలపరాదు చిత్రం ద్వారా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. టైమ్స్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆఫ్ ఇండియా 2018 లో ఆమె రెండుసార్లు స్థానం పొందింది.
మీనాక్షి చౌదరి హర్యానాలోని పంచకులలో జన్మించారు. ఆమె తండ్రి B.R చౌదరి భారత సైన్యంలో కల్నల్. మీనాక్షి .. చండీగఢ్లోని సెయింట్ సోల్జర్ ఇంటర్నేషనల్ కాన్వెంట్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె రాష్ట్ర స్థాయి స్విమ్మర్ మరియు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. చౌదరి పంజాబ్లోని డేరా బస్సీలోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ నుండి డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. మీనాక్షి చౌదరి వయస్సు 26 ఏళ్లు. మీనాక్షి చౌదరి నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ రీసెంట్గా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ను సాధించింది.