ఇంట్లో ఏ కూర చేసిన టమాటా ఉండాల్సిందే. టమాట లేకపోతే ఆ కూర వంటడం కుదరదన్న భావనలో చాలా మంది ఉంటారు. అలాంటి టమాట.. షుగర్ పేషంట్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. టమాటాల్లో లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ యాంటీ ఆక్సెడెంట్ రక్తంలోని షుగర్ లెవల్స్ని కంట్రోల్ చేస్తుంది. టమాటాల్లోని విటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. దీంతో.. డయాబెటిస్తో పోరాడే శక్తి మీకు వస్తుంది. టమాటను మీరు సలాడ్స్, కూరలు, జ్యూసుల రూపంలో తీసుకోవచ్చు.
మనలో చాలా మంది గోరు చిక్కుళ్లుని చాలా ఇష్టంగా తింటారు. గోరు చిక్కుడులో ప్రొటీన్లు చాలా అధికంగా ఉంటాయి. స్వల్పంగా పిండి పదార్ధాలు, పీచు పదార్థాలు ఉంటాయి. అంతేకాకుండా అనేక ఖనిజ లవణాల్ని గోరు చిక్కుడు కలిగి ఉంది. దీంతో డయాబెటిస్తో బాధపడేవారికి గోరు చిక్కుళ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రక్తంలోని చక్కెర స్థాయిని ఇది అదుపులో ఉంచుతుంది. అంతేకాకుండా గోరు చిక్కుడులో గ్లైకోన్యూట్రియెంట్లు ఉన్నాయి. ఇవి శరీరంలో షుగర్ లెవల్స్ని కంట్రోల్లో ఉంచుతాయి. అంతేకాకుండా దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. దీంతో.. డయాబెటిస్ పేషంట్లకు గోరు చిక్కుళ్లు సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు.
వీటితో పాటు మరికొన్ని కూరగాయల్ని మీ ఆహారంలో చేర్చుకుంటే డయాబెటిస్ ముప్పు తగ్గుతుంది. తోట కూర, బచ్చలి కూర, పాల కూర వంటి ఆకుకూరలు ఇన్సూలిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. దీంతో.. మధుమేహ రోగులు వీటని తినే ఆహారంలో తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆకుకూరలతో పాటు ఆస్పగగస్ (శతావరి), బెండకాయ, మష్రూమ్స్ వంటివి తీసుకున్న ఉత్తమ ఫలితాలు ఉంటాయి. బెండకాయల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. బెండకాయలో ఉండే ఫైబర్.. రక్తంలోని షుగర్ లెవల్స్ని కంట్రోల్ చేస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి.