ఆధ్యాత్మికం

తిరుమ‌ల‌ను సంద‌ర్శిస్తున్నారా..? అయితే క‌చ్చితంగా ఈ నియ‌మాల‌ను పాటించాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">తిరుమలను దర్శించుకునే భక్తులు మరచిపోకుండా ఆచరించవలసిన సంప్రదాయాలు కొన్ని ఉన్నాయి&period; వీటిని పాటించడం ఇక్కడి క్షేత్ర సంప్రదాయం&period; తిరుమల క్షేత్రంలో అడుగు పెట్టినవారు తొలిగా శుభ్రంగా సకలపాపాలు తొలగే శ్రీస్వామి పుష్కరిణి దివ్యతీర్థంలో స్నానం చేయాలి&period; పుష్కరిణి స్నానం తరువాత పుష్కరిణీ తీరంలోనే ఉండే ఆదివరాహస్వామివారిని మొదటగా దర్శించుకోవాలి&period; శ్రీస్వామి పుష్కరిణితో పాటు తిరుమల కొండల్లో ఉన్న దివ్యతీర్థాలను దర్శించి పుణ్యస్నానాలు ఆచరించాలి&period; శ్రీవేంకటాచల క్షేత్రంలోని తొలిదైవం ఆదివరాహస్వామి&period; ఈయననే శ్వేత వరాహస్వామి అంటారు&period; క్షేత్ర సంప్రదాయం ప్రకారం తొలిపూజ&comma; తొలి నైవేద్యం&comma; తొలి దర్శనం జరుగుతున్న ఈ వరాహస్వామిని దర్శించిన తరువాత శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించడం శ్రేష్ఠం&period; అలా చేస్తేనే శ్రీవారికి ఇష్టమని&comma; యాత్ర సఫలం అవుతుందని చెబుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిరుమలలో ఎట్టిపరిస్థితుల్లోనూ పాదరక్షలతో నడువరాదు&period; మద్యం&comma; మాంసం వంటి పదార్థాలను స్వీకరించరాదు&period; తిరుమలలో ప్రతి పువ్వు శ్రీవారి పూజకే అంకితం&period; కాబట్టి ఆడవారు ఎట్టిపరిస్థితుల్లో పూజకు ఉపయోగించే పూలను తలలో పెట్టుకోరాదు&period; నిర్మాల్యంగా తీసివేసిన పూలను మాత్రం తలలో పెట్టుకోవచ్చు&period; సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా&comma; అరుపులు&comma; వివాదాలు&comma; గొడవలను పెట్టుకోరాదు&period; సాధ్యమైనంత వరకు మౌనంగా భగవన్నామాన్ని స్మరణ చేసుకుంటూ ఉండాలి&period; అతి నిద్రకు దూరంగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79992 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;tirumala-7&period;jpg" alt&equals;"if you are visiting tirumala then must follow these rules " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శ్రీనివాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రానికి పరిపాలకుడు సాక్షాత్తు పరమశివుడు&period; ఆయనే ఈ క్షేత్రంలో రుద్రుడుగా పిలువబడుతున్నాడు&period; ఈ క్షేత్ర పాలకుడు&comma; గోగర్భంలో ఉంటూ మహాశివరాత్రికి అభిషేకాలు జరుపుకుంటున్నాడు&period; భక్త వరదుడైన తిరుమలేశునికి బంగారు వాకిళ్లు తెరవక ముందే ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో &lpar;2&period;30 – 3 గంటలు&rpar; బ్రహ్మదేవుడు తొలిపూజ చేస్తాడు&period; అందుకోసమే ఆలయంలో బ్రహ్మపూజ కోసం పెద్ద బంగారు గిన్నెలో జలాన్ని&comma; పళ్లెంలో చందనాన్ని ఉంచుతారు&period; ఆ తరువాత దాన్నే బ్రహ్మతీర్థంగా భక్తులకు ఇస్తారు&period; ప్రత్యేకంగా కన్యామాసం &lpar;తమిళ సంప్రదాయం&rpar;లో బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవాలు చేస్తున్నాడు&period; శ్రీవారి సుప్రభాతానంతరం స్వామివారికి మహంతు బావాజీవారి నవనీత హారతి తొలిగా సమర్పిస్తారు&period; శ్రీస్వామివారితో పాచికలాడిన పరమభక్తుడే ఈ మహంతు బావాజీ&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజు శ్రీవారి సుప్రభాతంలో తాళ్లపాక అన్నమయ్య వంశీయులు బంగారు వాకిళ్ల దగ్గర నేటికీ మేల్కొలుపు పాటలు పాడుతూ స్వామివారిని మేల్కొలుపుతారు&period; అలాగే రాత్రి ఏకాంత సేవలో జోలపాట పాడుతూ స్వామివారి పవళింపు సేవలో పాల్గొంటున్నారు&period; నిత్యం జరిగే కళ్యాణోత్సవంలో తాళ్లపాక వారు నిత్య కన్యాదాతలుగా సత్కారం పొందుతున్నారు&period; ప్రతిరోజు శ్రీవారి భోగశ్రీనివాసమూర్తికి&comma; ప్రతి శుక్రవారం మూలమూర్తికి ఆకాశగంగ తీర్థంతో అభిషేకం జరుగుతుంది&period; తిరుమలలోని ఆకాశగంగ తీర్థ జలాలను తెచ్చే కైంకర్యంలో సుమారు వెయ్యేళ్లుగా తిరుమలనంబి అనే వైష్ణవాచార్యుల వంశీయులు పాల్గొంటున్నారు&period; వీరు శ్రీరామానుజుల వారికి గురువులు&period; స్వయానా మేనమామ కూడా&period; శ్రీనివాసుడు వీరిని ఒక సందర్భంలో తాతా&period;&period; తాతా అన్నాడట&period; అందువల్లే తిరుమలనంబికి తిరుమల తాతాచార్యులు అనే పేరు వచ్చింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts