తెలుగులో మహానటిగా, తెరకెక్కిన ఒకప్పటి దక్షిణ భారత సినీ నటి సావిత్రి జీవిత కథ మహానటి సినిమా. ఈ సినిమాకు దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాతలు సి.అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ ఈ సినిమా వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్ కింద విడుదల అయింది. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించగా, దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్రప్రసాద్, భానుప్రియ ముఖ్యపాత్రలో కనిపించారు. మిక్కీ జే మేయర్ చిత్రానికి సంగీతం అందించారు.
సినిమా నిర్మాణం మే 2017 లో మొదలై 9 మే 2018న సినిమా విడుదల అయింది. కాగా, ఈ మూవీలో అక్కినేని నాగేశ్వరరావుగా నాగచైతన్య నటించారు. ఎన్టీఆర్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తారని ప్రచారం జరిగిన, ఆయన నటించలేదు. చివరికి ఆ పాత్రను ఎవరు పోషించలేదు. అయితే ఈ విషయంపై మహానటి మూవీని నిర్మించిన వైజయంతి మూవీస్ అశ్విని దత్ క్లారిటీ ఇచ్చారు. ఆలీతో సరదాగా షోలో ఆయన మాట్లాడుతూ రామారావు పాత్రను జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సిందన్నారు.
అయితే కొన్ని కారణాలవల్ల కుదరలేదని చెప్పారు. ఎన్టీఆర్ పాత్రకు తారక్ పేరు చెప్పగానే మూవీ యూనిట్ మొత్తం సంతోషం వ్యక్తం చేసిందన్నారు. అయితే అదే సమయంలో నందమూరి బాలకృష్ణ ‘ఎన్టీఆర్ బయోపిక్’ ప్రకటించారని అన్నారు. అశ్వినిదత్. దీంతో తమ సినిమాలో రామారావు పాత్రలో ఎవరిని పెట్టి తీసినా ప్రేక్షకులు తప్పుగా భావిస్తారేమోనని అనిపించిందని అన్నారు. ఇదే విషయం నాగ్ అశ్విన్ కు చెప్పానన్నారు. అయితే మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ లేకుండా తీస్తానని నాగి తనతో చెప్పాడని గుర్తు చేసుకున్నారు. అందుకే మూవీలో ఎన్టీఆర్ కు సంబంధించి కేవలం ఒక షాట్ మాత్రమే పెట్టామన్నారు. ఎన్టీఆర్ పామును పట్టుకునే సీన్ తీశామని, అది రామారావు కెరీర్ ఆరంభంలో నిజంగానే జరిగిందట అని చెప్పారు అశ్వినిదత్.