బాదంపప్పులో మన శరీరానికి కావల్సిన ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుంది. అందుకనే సూపర్ఫుడ్లలో దీన్ని ఒకటిగా పిలుస్తారు. ఇక చాలా మంది బాదం పప్పుతో స్వీట్లు చేసుకుంటారు. కొందరు దీన్ని నేరుగా అలాగే తింటే.. కొందరు నీటిలో నానబెట్టి పొట్టు తీసి తింటారు. అయితే బాదంపప్పును నిజానికి ఎలా తింటే మంచిది..? దీనిపై సైంటిస్టులు ఏమంటున్నారు..? అంటే..
బాదంపప్పులోనే కాదు, పొట్టులోనూ పలు పోషకాలు ఉంటాయి. వాటిలో ఉండే పలు రకాల ఎంజైమ్లు మన జీర్ణాశయంలో జీర్ణక్రియకు అడ్డుపడతాయి. కనుక బాదం పప్పును పొట్టు తీసి తినాలి. ఇక నీటిలో నానబెట్టడం వల్ల బాదంపప్పులో పోషకాలు మరింత మెరుగుపడతాయి. అలాగే అవి త్వరగా జీర్ణం అవుతాయి. అందుకని బాదంపప్పును నీటిలో నానబెట్టి, పొట్టు తీసి తినాలని సైంటిస్టులు చెబుతున్నారు.
అలా కాకుండా పొట్టుతో తింటే గ్యాస్, మలబద్దకం వచ్చే అవకాశాలు ఉంటాయని సైంటిస్టులు అంటున్నారు. ఇక చిన్నారులు, వృద్ధులు కూడా వాటిని తేలిగ్గా జీర్ణం చేసుకోవాలంటే.. వాటిని నీటిలో నానబెట్టి, పొట్టు తీసే తినాలని వైద్యులు కూడా చెబుతున్నారు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365