పొగాకు తినటం, సరైన ఆహారాలు తినకపోవటం, ఆల్కహాల్, సరిగ్గా పళ్ళు తోమకపోవడం వంటి వాటితో మీ పళ్ళు రంగు మారాయా? పసుపు రంగుకు తిరిగాయా? ఆందోళన చెందకండి. దంతాలు తెల్లగా మారేందుకు అనేక ప్రక్రియలున్నాయి. అయితే సహజంగా మీ దంతాలు మరోమారు తెలుపు రంగుకు వచ్చేయాలంటే ఏం చేయాలో పరిశీలించండి.
స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజ్ పండ్లు మీ దంతాలను సహజంగా శుభ్రపరచి మిలమిలమనేలా చేస్తాయి. వీటిలో వుండే సిట్రిక్ యాసిడ్ మీ చిగుళ్ళను కూడా శుభ్రపరచి నోరు దుర్వాసన లేకుండా చేస్తుంది. కనుక ఈ పండు తొనలతో పళ్ళు రుద్దండి. ఆవనూనె ఉప్పుతో కలిపి దానిలో ఒక నిమ్మ చెక్క ముంచి మీ పండ్లపై 5 నిమిషాలు రుద్ది తర్వాత ఫ్లోరైడ్ కల టూత్ పేస్ట్ తో కడిగేయండి. ఒక వారం పాటు వరుసగా ఆరెంజస్ తినండి. నిమ్మ చెక్క నాకండి. స్ట్రాబెర్రీ గుజ్జు రోజుకు రెండు సార్లు పంటిపై రాయండి.
వారానికోసారి బ్రష్ పై బేకింగ్ సోడా వేసి రుద్దండి. బేకింగ్ సోడా, స్త్రాబెర్రీ గుజ్జు కలిపి రాయండి. అయితే బేకింగ్ సోడా రోజూ పంటికి రాయవద్దు. ప్రతి భోజనం తర్వాత మీ నోటిని బాగా కడగండి. మీరు తిన్నది కొద్ది అయినా ఎక్కువైనా సరే నీటితో నోటిని కడగండి. వాసన పోవాలంటే బలమైన చిగుళ్లు రావాలంటే ఇదే మార్గం. రోజూ రెండు సార్లు బ్రష్ చేయండి. వేడినీటితో నోటిని కడగండి. కాఫీ మానండి. నోటికి అంటుకునే తిండ్లు తినకండి. ఈ చిట్కాలు పాటిస్తే వారం రోజుల్లో మీ దంతాలు వైట్ రంగులోకి వచ్చేస్తాయి.