1965 ఇండో-పాక్ యుద్ధంలో లాల్ బహదూర్ శాస్త్రి గాయపడిన సైనికులను కలవడానికి ఢిల్లీలోని సైనిక ఆసుపత్రికి వెళ్లారు. ఆయన తన సందర్శన సమయంలో చాలా మంది గాయపడిన సైనికులను కలిశారు . చివరికి మంచం మీద ఉన్న ఒక సైనికుడిని చూసి కలవడానికి వెళ్ళారు. పాపం, ఆ సైనికుని శరీరం లోని చాలా భాగాలు తీవ్రంగా గాయపడ్డాయని,, అతను బ్రతుకుతాడో లేదో మాకు తెలియదని, అతను బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని డాక్టర్ చెప్పారు.
శాస్త్రి అతని దగ్గరగా వెళ్లి ఆ సైనికుడి తలపై చేయి వేశాడు, ఆ సైనికుడి కళ్ళ నుండి కన్నీళ్ళు ధారగా కారసాగాయి. శాస్త్రి అతనితో సంభాషణ ప్రారంభించాడు. శాస్త్రి:- మేజర్, మీరు ప్రపంచ ప్రఖ్యాత భారత సైన్యంలో మేజర్, ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందిన సైన్యం. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి, ఏడవకండి. మీరు త్వరలోనే కోలుకుంటారు.
మేజర్:- సార్, ఇవి నొప్పి, గాయం వల్ల వచ్చే కన్నీళ్లు కావు. నా ప్రధానమంత్రిని ఒకసారి కలిసి ఆయనకు సెల్యూట్ చేయాలని కలలు కన్నాను కాబట్టి ఈ కన్నీళ్లు వచ్చాయి. ఈ రోజు నేను మిమ్మల్ని కలిశాను కానీ నేను నిలబడి మీకు నమస్కరించలేకపోతున్నాను.
శాస్త్రి కళ్ళ నుండి కన్నీళ్ళు కారాయి.