రక్షణ రంగం లో మనం చేసిన పొరపాట్లు లో ఒకటి, నేర్చుకున్న గుణపాఠాలు గురించి కూడా ప్రస్తావించుకుందాము. 1990 లో పాశ్చాత్య దేశాలు వారి assault rifles ( సైనికులు యుద్ధం లో వాడే gun) లో పూర్వం 7.62 rounds ( bullet లు) వాడేవారు, మనం కూడా ఎక్కువగా అవే వాడేవాళ్ళం. ఈ బుల్లెట్ లు పెద్దగా ఉండటం వల్ల, అది తగిలిన వారు చనిపోయే అవకాశం ఎక్కువ. పాశ్చాత్య దేశాల ఆలోచనా విధానం లో ఒక మార్పు వచ్చింది. ఈ తుపాకులు వాడి ఒక సైనికుడిని కాలిస్తే , అతను చనిపోవడం వల్ల జరిగే నష్టం కన్నా, దానికన్నా బలహీనమైన 5.56mm bullet వాడితే శత్రువు చనిపోకుండా గాయపడతాడు, అతనిని యుద్ధరంగం నుంచి కాపాడటానికి తనతో పాటు మరో ఇద్దరు సైనికులు వెళ్ళాలి, వాహనం, వైద్యం etc etc లెక్క వేసుకుంటే ఈ నష్టం ఏదో బాగుంది అనుకున్నారు.
భారత దేశం కూడా అదే దారి లో, బలహీనమైన 5.56mm bullet లు ఉన్న తుపాకులను సైనికులకి ఇచ్చింది. మనిషి ప్రాణానికి విలువ ఇచ్చే పాశ్చాత్య సైనికుల ప్రవర్తన వేరు, చనిపోయిన వారు అసలు మా సైనికులే కాదు అని వదిలేసే దేశం మీద ఇటువంటి టెక్నిక్ ఎలా పనిచేస్తుంది? పని చేయలేదు. 5.56 బుల్లెట్ ఎక్కువ దూరం ప్రయాణించడం లేదు అని గురి చూసి కాల్చినా, 7.62 రౌండ్ ఐతే శత్రువు పోయేవాడు కానీ ఈ బలహీనమైన బుల్లెట్ తగిలిన వాడు తేరుకుని తిరిగి ఎదురుదాడి చేసే అవకాశం ఇస్తుంది అని గుర్తించలేదు. తీవ్ర వాదులతో జరిగే కాల్పుల్లో , సగటు సైనికుడు తీవ్రం గా ఇబ్బంది పడుతున్నాడు అని, వీటికి stopping power లేదు అని మొరపెట్టుకున్నారు సైనికులు.
5.56 బుల్లెట్ బలహీనమైనది అయినా గన్ లో ఎక్కువ బుల్లెట్ లు పడతాయి అని, ఎక్కువ దూరం బుల్లెట్ వెళ్ళలేకపోయినా , accuracy 7.62 కన్నా ఎక్కువని. Recoil తక్కువని అవే ఇచ్చారు. తీవ్రవాదులను ఎన్కౌంటర్ చేసి వారి దగ్గర ఉన్న AK47 లు ( 7.62 బుల్లెట్) ఏరుకుని , వాటిని మన కౌంటర్ insurgency సైనికులు పంచుకుని తీవ్రవాదులతో పోరాడేవారు. నేపాల్ అయితే ఇవి మాకు వద్దు అని తిరిగి ఇచ్చేసింది. ఈ తుపాకులు , చలిలో struck అయిపోతున్నాయి, నాసిరకం ప్లాస్టిక్ వాడిన చోట పగిలిపోతుంది, గురి చూసి కాల్చినప్పుడు , గన్ లో ఉండే oil, వెనుకకి వచ్చి సైనికుడి కళ్ళల్లోకి చిమ్ముతుంది అని మన సైనికులు చెప్పేవారు.
కార్గిల్ యుద్ధం లో వీటితో మన సైనికులు యుద్ధం చేశారు. 2016 లో ప్రభుత్వం సైనికులు పడుతున్న ఇబ్బంది అర్ధం చేసుకుని INSAS guns కి సపోర్ట్ నిలిపివేసింది, 2019లో అధునాతన ఆయుధాలు సైన్యానికి ఇచ్చారు. ఇప్పటికే 72,000 పైగా SIG716s రైఫిల్స్ పాకిస్తాన్ , చైనా సరిహద్దుల్లో front line లో ఉన్న సైనికులకు అందచేశారు. మరో 73,000 రైఫిల్స్ 2025 లో అందజేయబడ్డాయి. 1,75,000 AK203 రైఫిల్స్ దిగుమతి చేసుకుని సైనికులకు ఇచ్చారు. మొత్తం 6,70,000 రైఫిల్స్ భారత్ లో తయారు చేసి ఇస్తారు. Para మిలిటరీ బలగాలు కూడా 7.62 రౌండ్ rifles అందుకోనున్నారు.