రావణుడు. పురాణాల ఇతిహాసాల ప్రకారం ప్రతినాయకుడు. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన రావణుడు పరమశివ భక్తుడు. సీతను తన రాజ్యానికి ఎత్తుకెళ్ళాడు. తన భార్యకోసం రాముడు అడవులు, ఇతర రాజ్యాలు వెతుకుతున్నాడు. అలా లంకలో తన భార్య ఉందని తెలుసుకున్న శ్రీరాముడు రావణుడి సామ్రాజ్యంపై పోరాటానికి సిద్ధపడి, తనకెదురు వస్తున్న లంకేయులను సంహరిస్తుంటాడు. రాముడిని తుదముట్టించడానికి ఆ పరమశివుడి కోసం కైలాస పర్వతం మీద కూర్చొని తపస్సు చేస్తుంటాడు. శివుడు ప్రత్యక్షమై రావణుడుని ఏ వరం కావాలో కోరుకోమంటాడు. లంకపై దండెత్తిన రాముడిని యుద్ధంలో ఓడించాలని, లంక సామ్రాజ్యం తన చేతుల్లోనే ఉండాలని కోరుకుంటాడు. రావణుడి కోరిక తెలుసుకున్న ఆ భోళాశంకరుడు తన కోరుకున్న కోరికకు అంగీకరించి ఒక శివలింగాన్ని ఇచ్చి, నిబంధన విధిస్తాడు. లంక చేరేంతవరకు ఈ శివలింగాన్ని భూమిపై పెట్టకూడదని రావణుడుకి చెబుతాడు.
శివుడు అలా మాయమవ్వగానే రావణుడు తన ప్రయాణాన్ని లంకకు ప్రారంభించాడు. లంకకు శివలింగాన్ని రెండు చేతులతో పట్టుకొని వెళుతుండగా, బజైనాథ్ అనే జిల్లాలో గల ఒక గ్రామంలోకి రాగానే, దాహం వేయడంతో అక్కడే ఉన్న గొర్రెల కాపరికి ఆ శివలింగం ఇచ్చి దాహం తీర్చుకు వస్తానని చెబుతాడు. ముఖ్యవిషయంగా ఆ శివలింగం కింద పెట్టరాదని చెబుతాడు. అలా రావణుడు వెళ్లి దాహం తీర్చుకురాగానే ఆ గొర్రెలకాపరి అక్కడినుండి వెళ్ళిపోతాడు. దాంతో శివుడు ప్రసాదించిన శక్తులు మాయమైపోతాయి.
శివలింగం, తనకు ఇచ్చిన శక్తులు మాయమైపోగానే ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్న రావణుడు, మళ్ళీ శివుడిని ప్రార్థించడం మొదలుపెడతాడు. తన 10 తలలను నరికివేసుకుంటాడు. శివలింగాన్ని కిందపెట్టి తన వరాలు పోగొట్టుకున్న రావణుడు ఆ చిన్న తప్పిదం వల్ల తన 10 తలలను నరికేసుకోవలసి వచ్చింది. అయితే శివుడి కృపతో మళ్ళీ ఆ 10 తలలు యధాస్థానానికి చేరుతాయి. రావణుడి కథని రామాయణంతో పాటు మహాభారతంలోనూ ప్రస్తావిస్తారు. పరమ శివ భక్తుడైన రావణుడుకి, అడవులపాలై అజ్ఞాతవాసం చేస్తున్న పాండవులు ఉత్తర భారతదేశంలో గుడిని నిర్మించారు. ఆ గుడినే ‘శివధామం’గా పిలుస్తారు.
ఈ శివధామంను దర్శించుకోవడానికి ప్రజలు ఎన్నో సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వెళుతూ, ఆయన ఆశీర్వాదం పొందుతారు. ప్రజలు ఎంతో విశ్వాసంగా ఈ శివధామంను దర్శించుకుంటుండగా, ఉత్తర మరియు దక్షిణ భాగాలవైపు గుడిలోపలికి ప్రవేశించడానికి ఈ ఆలయంలో ఉండటం ప్రత్యేకత. పెద్ద పెద్ద గోడలు, ప్రతిమలను ఇక్కడ బంగారు ఆభరణాలతో అలంకరించి ఉంటారు.