Viral Video : భారీగా ఉరుములు, మెరుపులతో వర్షాలు పడినప్పుడు ఎవరికైనా సరే భయంగానే అనిపిస్తుంది. ఆ సమయంలో పిడుగులు పడితే ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. అయితే పిడుగులు పడే చోట ఉండకూడదని చెబుతుంటారు. చెట్ల కింద, ఓపెన్ స్థలంలో అస్సులు ఉండరాదు. లేదంటే పిడుగు పడే చాన్స్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఓ వ్యక్తి అలా ఓపెన్ స్థలంలో ఉండగా.. అతనిపై పిడుగు పడింది. అయినప్పటికీ అతనికి ఏమీ కాలేదు. ఇండోనేషియాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఇండోనేషియాలోని ఉత్తర జకార్తాలో సిలిన్సింగ్ అనే ఓ టౌన్ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలో అబ్దుల్ రోస్యిద్ (35) అనే వ్యక్తి సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ఒక రోజు అతను ఎప్పటిలాగే పరిశ్రమలో తిరుగుతూ చెకింగ్లు చేస్తున్నాడు. భారీగా ఉరుములు, మెరుపులతో వర్షం పడుతుండడంతో అతను గొడుగు వేసుకుని డ్యూటీ చేస్తున్నాడు.
అందులో భాగంగానే అతను ఓ ఖాళీ స్థలంలోకి రాగానే సడెన్ గా అతనిపై పిడుగు పడింది. దీంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తోటి సెక్యూరిటీ గార్డులు అతన్ని గమనించి వెంటనే అతన్ని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
https://youtu.be/XFLhu7v-IDU
అయితే అతను గొడుగు వేసుకుని ఉన్నాడు కనుక పిడుగు పడినా అతనికి ఏమీ కాలేదు. చేతులకు స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో 4 రోజుల పాటు అతను హాస్పిటల్లో ఉండి డిశ్చార్జి అయ్యాడు. అతను అలా అదృష్టం కొద్దీ పిడుగు నుంచి తప్పించుకున్నాడు. లేదంటే ప్రాణాలు పోయి ఉండేవి.
ఇక ఆ సమయంలో అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో అతనిపై పిడుగు పడ్డ దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో అవి సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలా మంది అతన్ని చూసి మొదట షాక్ అయినా.. అతను తప్పించుకోవడంతో.. నిజంగా అతను చాలా అదృష్టవంతుడని కామెంట్లు చేస్తున్నారు.