Masala Veg Pulao : క‌మ్మ క‌మ్మ‌ని మ‌సాలా వెజ్ పులావ్‌.. 10 నిమిషాల్లో ఇలా చేయ‌వ‌చ్చు..!

Masala Veg Pulao : మ‌నం వంటింట్లో ర‌క‌ర‌కాల పులావ్ వెరైటీల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన పులావ్ వెరైటీల్ల‌లో మ‌సాలా వెజ్ పులావ్ కూడా ఒక‌టి. లంచ్ బాక్స్ లోకి కూడా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో, ఇంటికి అతిథులు వ‌చ్చిన‌ప్పుడు అప్ప‌టికప్పుడు ఈ పులావ్ ను త‌యారు చేసి తిన‌వ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. వంట‌రాని వారు కూడా ఈ పులావ్ ను సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌దు. తిన్నా కొద్ది తినాల‌నిపించేంత రుచిగా ఉండే ఈ మసాలా వెజ్ పులావ్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌సాలా వెజ్ పులావ్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌గంట పాటు నాన‌బెట్టిన‌ బాస్మ‌తీ బియ్యం – 2 గ్లాసులు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, పొడుగ్గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ఒక కప్పు, సాజీరా – ఒక టీ స్పూన్, మ‌రాఠీ మొగ్గ‌లు – 2, బిర్యానీ ఆకులు – 2, ల‌వంగాలు – 4, యాల‌కులు – 2, న‌ల్ల యాల‌క్కాయ – 1, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, జాప‌త్రి – కొద్దిగా, అనాస పువ్వులు – 2, జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, బంగాళాదుంప ముక్క‌లు – ఒక క‌ప్పు, ట‌మాట ముక్క‌లు – అర క‌ప్పు, ప‌చ్చి బ‌ఠాణీ – పావు క‌ప్పు, పెరుగు – ముప్పావు క‌ప్పు, ప‌సుపు – పావు టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, పుదీనా – కొద్దిగా, నీళ్లు – రెండున్న‌ర గ్లాసులు.

Masala Veg Pulao recipe in telugu very tasty easy to prepare
Masala Veg Pulao

మ‌సాలా వెజ్ పులావ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకోవాలి. త‌రువాత ఇందులో ప‌సుపు, ఉప్పు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి ఉండ‌లు లేకుండా క‌లిపి ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత కుక్క‌ర్ లో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, జీడిప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇవ‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు, బ‌ఠాణీ వేసి క‌ల‌పాలి.

వీటిపై మూత పెట్టి పెద్ద మంట‌పై 3 నిమిషాల పాటు వేయించాలి. ఇలా వేయించిన త‌రువాత మంట‌ను మ‌ధ్య‌స్థంగా చేసి ముందుగా సిద్దం చేసుకున్న పెరుగు వేసి క‌ల‌పాలి. త‌రువాత కొత్తిమీర‌, పుదీనా వేసి క‌ల‌పాలి. త‌రువాత నాన‌బెట్టిన బియ్యం వేసి క‌ల‌పాలి. త‌రువాత నీళ్లు పోసి క‌లిపి కుక్క‌ర్ మూత పెట్టాలి. దీనిని ఒక విజిల్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. కుక్క‌ర్ ఆవిరి పోయిన త‌రువాత మూత తీసి అంతాక‌లిసేలా కలుపుకుని స‌ర్వ్ చేసుకోవాలి. దీనిని రైతాతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన వెజ్ పులావ్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts