Restaurant Style Kaju Masala Gravy : రెస్టారెంట్ల‌లో లభించే కాజు మ‌సాలా గ్రేవీ.. ఇలా చేస్తే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Restaurant Style Kaju Masala Gravy : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో లభించే మ‌సాలా క‌ర్రీల‌ల్లో కాజు మ‌సాలా గ్రేవీ కర్రీ కూడా ఒక‌టి. ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ క‌ర్రీని రుచి చూసే ఉంటారు. దేనితో తిన‌డానికైనా ఈ క‌ర్రీ చాలా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ కాజు మ‌సాలా గ్రేవీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా ఇంట్లోనే కాజు మ‌సాలాగ్రేవీ క‌ర్రీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా తేలిక‌. ఎవ‌రైనా చాలా సుల‌భంగా ఈ క‌ర్రీని త‌యారు చేసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ కాజు మ‌సాలా గ్రేవీని ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కాజు మ‌సాలా గ్రేవీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నాన‌బెట్టిన‌ జీడిప‌ప్పు – 1\3 క‌ప్పు, నూనె – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన అల్లం – 2 ఇంచుల ముక్క‌, వెల్లుల్లి రెబ్బ‌లు- 6, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ట‌మాటాలు – చిన్న‌వి రెండు, ప‌సుపు – పావు టీ స్పూన్, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ ముక్క‌లు – ముప్పావు క‌ప్పు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, కారం – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, బ‌ట‌ర్ – ఒక టేబుల్ స్పూన్, క‌సూరిమెంతి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Restaurant Style Kaju Masala Gravy recipe in telugu tastes better with rice
Restaurant Style Kaju Masala Gravy

కాజు మ‌సాలా గ్రేవీ త‌యారీ విధానం..

ముందుగా క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత అల్లం, వెల్లుల్లి రెబ్బ‌లు, జీడిప‌ప్పు, ట‌మాట ముక్క‌లు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసివీటిని చ‌ల్లార‌నివ్వాలి. ట‌మాట ముక్క‌లు చ‌ల్లారిన త‌రువాత వీటిని జార్ లో వేసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మ‌రో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ త‌రుగు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు చ‌క్క‌గా వేగిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, కొద్దిగా నీళ్లు, కారం, ఉప్పు, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి.

త‌రువాత దీనిపై మూత పెట్టి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత నాన‌బెట్టిన జీడిప‌ప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి మ‌ర‌లా నూనె పైకి తేలే వ‌ర‌కు ఉడికించాలి. ఇలా ఉడికించిన త‌రువాత బ‌ట‌ర్, క‌సూరిమెంతి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. దీనిని ఒక నిమిషం పాటు ఉడికించి కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాజు మ‌సాలా గ్రేవీ క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, రోటీ, చ‌పాతీ, నాన్ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ కాజు మ‌సాలా గ్రేవీని చాలా సుల‌భంగా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts