ప్రెగ్నెన్సీ ఉన్న సమయంలో పండ్లు తప్పక తినాలి. ఎందుకంటే పండ్లలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పోషక పదార్థాలు అనేకంగా ఉంటాయి.. అవి గర్భిణీ స్త్రీలకు చాలా ఉపయోగకరం. కాబట్టి ఈ ఏడు రకాల పండ్లను తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. మరి అవేంటో చూద్దాం.. నారింజ పండు మిమ్మల్ని తేమగా ఉంచడమే కాకుండా విటమిన్ సి,పోలిక్ యాసిడ్ వంటి విటమిన్లను అందిస్తుంది. ఫోలిక్ యాసిడ్ అనేది పుట్టబోయే బిడ్డకు బ్రెయిన్, వెన్నెముక సమస్యలు రాకుండా చేస్తుంది. గర్భంతో ఉన్న మహిళలకు రోజుకు 600 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ అవసరం.
మామిడి పండులో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే మామిడి పండ్లను తినాలి. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో రోజు నిమ్మరసం తాగాలి. దీనివల్ల మీకు వాంతులు, వికారం వంటివి రాకుండా ఉంటాయి. అరటి పండులో పొటాషియం, విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి మలబద్దకం రాకుండా చూస్తాయి. బీపీని తగ్గిస్తాయి.
యాపిల్ పండులో విటమిన్ ఏ, సి, ఫైబర్, పొటాషియం ఉంటాయి. యాపిల్ పండ్ల వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. యాపిల్ ని తొక్కతో సహా తినండి. గర్భంతో ఉన్న సమయంలో బ్లూ బెర్రీస్, రాస్ప్ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటివి ఎక్కువగా తినాలి. వీటిలో విటమిన్ సి, ఫైబర్, ఫోలేట్,ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. మీ పుట్టబోయే బిడ్డకు ఇవి ఎక్కువ ఎనర్జీని అందిస్తాయి. విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్లు అవకాడో పండ్లలో ఎక్కువగా ఉంటాయి. ఈ పండ్లు గర్భిణీలకు పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తాయి.