బృందావనం సినిమాలో మనకు శ్రీహరి.. ప్రకాష్ రాజ్ వాళ్ళ ఇంటికి రాగానే , ఒక డైలాగ్ గట్టిగా చెప్తారు అదేంటి అంటే, నాయన అన్నొచిండు.. అని. నిజానికి ప్రకాష్ రాజ్ మరియు శ్రీహరి ఎన్నో సినిమాల్లో నటించినా, మనలో చాల మందికి తెలియని విషయం ఏమిటంటే వీళ్లిద్దరు తోడల్లులు అవుతారని.
అవునండీ! ప్రకాష్ రాజ్ గారు మొదట వివాహం శ్రీహరి గారి భార్య డిస్కో శాంతి గారి రెండో చెల్లి ఓల్గా లలిత కుమారి అంట. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రకాష్ రాజ్ గారు అనివార్య కారణాల వలన లలిత గారికి విడాకులు ఇఛ్చి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ పోనీ వర్మ ను రెండో వివాహం చేసుకున్నారు.
కానీ శ్రీహరి గారు మరియు ప్రకాష్ రాజ్ గారు మాత్రం వారి అనుబంధం తర్వాత కూడా సంతోషంగా కొనసాగించారని, వాళ్ళు చేసిన సినిమాలే చెప్తున్నాయి. ప్రకాశ్ రాజ్ ఏకంగా రెండున్నర దశాబ్దాలకు పైగా సినిమాల్లో ఉన్నారు. ఆయన దక్షిణాదిలో అన్ని భాషల్లో ఎన్నో వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు.