మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యెక్కించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి.. ఉత్తరాదిలో తెలుగు సినిమాలకు అంతగా గుర్తింపు లేని రోజుల్లో తన సినిమాలతో తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో నిలబెట్టాడు. ఇండియాలోనే కోటికి పైగా రెమ్యూనరేషన్ అందుకున్న మొదటి హీరోగా చిరు రికార్డు సృష్టించాడు. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ ప్రస్థానం మొదలుపెట్టి.. ఎన్నో ఇండస్ట్రీ హిట్లు, మరెన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి కోట్లలో అభిమానులను సంపాదించుకున్నాడు. మొదట్లో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అనేక ఇబ్బందులు పడ్డాడు. కనీసం తిండి కూడా దొరకక కష్టాలు అనుభవించారు. చిరంజీవి – సుధాకర్ ఏ స్థాయి స్నేహితులు అందరికీ తెలిసిందే.
ఇప్పుడు వాళ్ళ మధ్య కాస్త దూరం ఉన్నా అప్పట్లో మాత్రం చాలా సన్నిహితంగా ఉన్నారు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఒక చిన్న రూమ్ అద్దెకు తీసుకొని అందులో హరి ప్రసాద్, సుధాకర్, చిరంజీవి కలిసి ఉండేవారు. ఎక్కడ ఆడిషన్స్ జరిగితే అక్కడికి వెళ్లేవారు. ఆ సమయంలో వీరికి ఒక పూట తినడానికి కూడా భోజనం దొరికేది కాదు. పస్తులు కూడా ఉండేవారు. అలా చాలా ఇబ్బందులు పడుతున్న సమయంలో ఒకరోజు సుధాకర్ ఇవాళ ఏం కర్రీ చేసుకుందాం అని వీళ్ళతో అంటుంటే.. సుధాకర్ కి వాళ్ళ పక్కింట్లో ఒక ములక్కాయ చెట్టు కనిపించింది. దీంతో గోడ ఎక్కి ఆ ములక్కాయలు మొత్తం తెంపి కర్రీ వండారు. అలా వండుకున్న కర్రీ ముగ్గురు వేసుకుని తింటుంటే ఆ పక్కింటి ఆయన వచ్చి మా చెట్టు ములక్కాయల్ని తెంపుతావా అంటూ పెద్ద గొడవ చేశారట.
వాళ్లు వండుకున్న కర్రీ కూడా తీసుకొని వెళ్ళాడట. అలా జరగడంతో వాళ్లకి చాలా అవమానం అనిపించిందట. ఇలా కడుపు నింపుకోవడం కోసం దొంగతనం కూడా చేసి, అవమానాల పాలైన వారు ఎంతో కసిగా ప్రయత్నం చేసి సినిమాలలో అవకాశాలు దక్కించుకొని స్టార్ట్లుగా ఎదిగారు. ఇందులో చిరంజీవి మాత్రం మెగాస్టార్ గా మారి ఇండస్ట్రీకి పెద్దన్నలా మారారు. సుధాకర్ కూడా తనదైన కామెడీతో అదరగొట్టి తమిళ్, తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సాధించారు. ప్రస్తుతం చిరంజీవి సినిమాలలో హీరోగా చేస్తూ బిజీగా ఉండగా.. సుధాకర్ సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగా ఉన్నాడు. ఒకప్పుడు టాప్ కమెడియన్ గా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుధాకర్.