ప్రస్తుత తరుణంలో చాలా మంది ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. కొందరికి సంపాదన సరిగ్గా ఉండడం లేదు. కొందరు ధనం సంపాదించినా కూడా చేతిలో నిలబడడం లేదు. ఇలా అనేక రకాలుగా చాలా మందికి డబ్బు సమస్యలు వస్తున్నాయి. అయితే డబ్బు సమస్య ఉన్నవారు కింద చెప్పిన చిన్న మంత్రాన్ని రోజూ పఠిస్తే చాలు, దాంతో లక్ష్మీదేవి అనుగ్రహం మీపై కలుగుతుంది. ధనం సంపాదిస్తారు. చేతిలో ధనం నిలుస్తుంది. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. ఇక ఆ మంత్రం ఏమిటంటే..
ఎంతటి దరిద్రాన్నయినా సరే అతి తక్కువ సమయంలో తప్పించి సమస్త శోభన సంపత్తులనూ ప్రసాదించగల సిద్ధమంత్రమిది. మొదటిరోజున -1008 సార్లు, తర్వాత రోజు నుంచి ప్రతిరోజూ 108 సార్లు చొప్పున పఠిస్తే దరిద్రం మన దరికి రాదంటున్నారు పండితులు.
ఏకాసనంలో ఈ మంత్ర జపం చేయాలి. 27 రోజులలో ప్రతిఫలం చూపిస్తుందని ఎందరో పెద్దలు చెప్పిన మంత్రమిది. ఓం హ్రీం త్రిభువన పాలిన్యై | మహాలక్ష్మై |, అస్మాకం దారిద్ర్యం నాశయ నాశయ |, ప్రచురం ధనం మే దేహిదేహి | క్లీం హ్రీం శ్రీం ఓం ||
ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనం కనక వర్షంలా కురుస్తుంది.