సినిమా అంటేనే కత్తి మీద సాము లాంటిది.. ఇండస్ట్రీలో ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయి ఖచ్చితంగా హిట్ కొడుతుందని అనుకున్న సినిమాలు అంచనాలను తలకిందులు చేసి దారుణంగా విఫలమవుతాయి.. అయితే ఒక్కోసారి కొన్ని సినిమాలు మాత్రం కొంతవరకు హిట్ అయితే చాలు అనుకొని థియేటర్ లోకి వచ్చి రికార్డులు క్రియేట్ చేస్తాయి.. ఇలా ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందో, ఎప్పుడు ఏ మూవీ ఫ్లాప్ అవుతుందో చిత్ర యూనిట్ చేతిలో ఉండదు.. అయితే ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోయిన్లు బాగా డబ్బు సంపాదించి నిర్మాతగా మారి డెవలప్ అయిన వారు ఉన్నారు.. అలాగే ఇండస్ట్రీలో కొంత సంపాదించుకొని నిర్మాతగా నష్టపోయి అనేక ఇబ్బందులు పడే వారు ఉన్నారు.. అలా తెలుగు ఇండస్ట్రీలో నిర్మాతగా మారి డబ్బు పోగొట్టుకున్న హీరోయిన్లు ఎవరో మనం ఇప్పుడు చూద్దాం..
సావిత్రి: ఒకప్పుడు తమిళ తెలుగు ఇండస్ట్రీలో హీరోలకు సమానంగా పోటీ ఇచ్చిన కథానాయిక సావిత్రి. ఈమె అప్పట్లో చిన్నారి పాపలు అనే మూవీ నిర్మించి భారీగా నష్టపోయారు.. జయసుధ : జయసుధ కలికాలం, అదృష్టం, వింత కోడళ్ళు ఇంకా కొన్ని చిత్రాలు నిర్మించి డబ్బు సంపాదించి, మళ్లీ కొన్ని చిత్రాల మీద భారీగా నష్టపోయింది. భూమిక: స్టార్ హీరోయిన్ అయ్యాక కూడా తకిట తకిట అనే మూవీ నిర్మించి రెండు కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి కోటి రూపాయలు నష్టపోయింది. కళ్యాణి : ఈమె ఒక ద్విభాషా చిత్రాన్ని k2k ప్రొడ్యూసర్ అనే బ్యానర్ పై నిర్మించి భారీగా నష్టపోయింది.
విజయశాంతి : నిప్పురవ్వ చిత్రానికి సహ నిర్మాతగా చేసి చాలా నష్టపోయింది. ఘట్టమనేని మంజుల: మంజుల మహేష్ బాబు తో నాని, అలాగే కావ్యాస్ డైరీ’స్ అనే చిత్రాలు నిర్మించి భారీగా నష్టపోయింది. రోజా : రోజా కూడా ఒక చిత్రాన్ని నిర్మించి ఆ సినిమా విఫలమవడంతో భారీగా నష్టపోయనని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. శ్రీదేవి : ఈమె కూడా కొన్ని చిత్రాలకు సహనిర్మాతగా చేసి కోట్ల రూపాయలు నష్ట పోయిన సందర్భాలు అనేకం. ఛార్మి : హీరోయిన్ గా చేసి బాగా సంపాదించింది. ఆ తర్వాత నిర్మాతగా పైసా వసూల్, మెహబూబా, లైగర్ వంటి సినిమాలతో భారీగా నష్టపోయింది. సుప్రియ యార్లగడ్డ: ఈమె కూడా రాజ్ తరుణ్ తో అనుభవించు రాజా అనే మూవీ ని నిర్మించి భారీగా నష్టపోయింది.