కిడ్నీ స్టోన్స్‌ సమస్య నుంచి బయట పడేందుకు చిట్కాలు..!

కిడ్నీ స్టోన్ల సమస్య అనేది సాధారణంగా చాలా మందికి వస్తూనే ఉంటుంది. నేషనల్ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌ (ఎన్‌సీబీఐ) చెబుతున్న వివరాల ప్రకారం దేశంలో 12 శాతం మంది కిడ్నీ స్టోన్ల సమస్యతో బాధపడుతుండగా వారిలో 50 శాతం మందికి అసలు ఆ సమస్య ఉన్నట్లే తెలియిదు. ఈ క్రమంలో సమస్యను ముందుగానే గుర్తించలేకపోతున్నారు. దీంతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.

home remedies for kidney stones

మనం తినే ఆహారాల్లోని వ్యర్థాలు కిడ్నీల్లో పేరుకుపోవడం వల్ల కిడ్నీ స్టోన్ల సమస్య వస్తుంది. చిన్న చిన్న రాళ్లు ఉంటే మూత్రంలో పడిపోతాయి. కానీ రాళ్లు పెద్దగా అయితే పడిపోవు. దీంతో మూత్రపిండాల్లో నొప్పి కలుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు వస్తాయి. ఇక కిడ్నీ స్టోన్లు ఎక్కువగా కాల్షియం, ఆగ్జలేట్‌ స్ఫటికాల వల్ల ఏర్పడుతుంటాయి. వాటినే కాల్‌క్యులి లేదా యురోలిథియాసిస్‌ అని పిలుస్తారు.

కిడ్నీ స్టోన్ల సమస్య వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. తగినంత నీటిని తాగకపోయినా, శరీరం తరచూ డీహైడ్రేషన్‌ బారిన పడుతున్నా, కిడ్నీల్లో ద్రవాలు చాలా నెమ్మదిగా కదిలినా స్టోన్లు ఏర్పడుతాయి. దీంతో ఆహారపదార్థాల్లోని లవణాలు, మినరల్స్‌ పేరుకుపోయి రాళ్లుగా ఏర్పడుతాయి. ఇక మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉంటే కొందరిలో లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కనిపించవు. కొందరిలో తీవ్రమైన నొప్పి కలుగుతుంది.

కిడ్నీ స్టోన్స్‌ను వీలైనంత వరకు సర్జరీ లేకుండానే తొలగించుకోవచ్చు. ద్రవాహారం ఎక్కువగా తీసుకుంటే కిడ్నీ స్టోన్స్‌ ఏర్పడకుండా ఉంటాయి. అలాగే కింద తెలిపిన పలు చిట్కాలను పాటించడం వల్ల కూడా మూత్ర పిండాల్లో రాళ్లు పడిపోతాయి. ఆ చిట్కాలు ఏమిటంటే..

1. కిడ్నీ స్టోన్స్‌ సమస్య ఉన్నవారు నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు కనీసం 12 గ్లాసుల నీటిని తాగాలి. దీంతో కిడ్నీల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. అలాగే కిడ్నీల్లో ఉండే రాళ్లు నెమ్మదిగా పడిపోతాయి.

2. రోజూ మూడు పూటలా భోజనం చేసే ముందు ఒకటి లేదా రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని తాగాలి. నిమ్మరసంలో ఉండే సిట్రేట్‌ రాళ్లను కరిగిస్తుంది. రాళ్లు ఏర్పడకుండా చూస్తుంది.

3. తులసి ఆకుల్లో ఉండే సమ్మేళనాలు శరీరంలోని యూరిక్‌ యాసిడ్‌ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా ఉంటాయి. తులసి ఆకుల్లో అసిటిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్లను కరిగిస్తుంది. రోజూ ఉదయాన్నే పరగడుపునే ఒక టీస్పూన్‌ తులసి ఆకుల రసాన్ని సేవించడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి.

4. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో అసిటిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్‌ను కరిగిస్తుంది. భోజనానికి ముందు ఒక గ్లాస్‌ నీటిలో ఒక టీస్పూన్‌ యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ను కలిపి తాగితే ఫలితం ఉంటుంది.

5. గోధుమ గడ్డి జ్యూస్‌లో ఉండే సమ్మేళనాలు మూత్రం ఎక్కువగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. దీంతో కిడ్నీ స్టోన్లు సులభంగా పడిపోతాయి. గోధుమగడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మూత్రాశయంలో ఏర్పడే కాల్షియం వ్యర్థాలను బయటకు పంపుతాయి. రోజూ ఉదయాన్నే పరగడుపునే 30 ఎంఎల్‌ మోతాదులో గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే కిడ్నీ స్టోన్స్‌ సమస్య నుంచి బయట పడవచ్చు.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Share
Admin

Recent Posts