భారత వైమానిక దళం వాస్తవానికి ఎన్ని యుద్ధ విమానాలను కోల్పోయింది? ఇది భారతదేశ హిందీ లాబీ చేసిన చాలా పెద్ద, నీచమైన కుట్ర లేదా విధ్వంసం కాదా? భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఏమి దాచిపెడుతోంది? ఈ విపరీతమైన గోప్యత ఎక్కడ ముగుస్తుంది? ఏదైనా రెండు దేశాల మధ్యన యుద్ధం కొన్ని లక్ష్యాలు సాధించడానికి జరుగుతుంది. ఇప్పుడు మన దేశం పాకిస్తాను మీద యుద్ధం చేసింది. మరొక విషయం, మేము యద్ధం చేస్తాము అని 15 రోజుల ముందుగానే హెచ్చరించి యుద్ధం చేసింది. యుద్ధం చేయాలని ముందుగా ఒక రాజకీయ నిర్ణయం అత్యధిక స్థాయిలో తీసుకుంటారు. ఆ నిర్ణయాన్ని సైనిక అధిష్టాన వర్గానికి తెలియ చేస్తారు. అప్పుడు ఆ సైనికాధికారులు యుద్ధంలో సాధించవలసిన లక్ష్యాలను నిర్ణయిస్తారు. ముందుగా ప్రాధమిక లక్ష్యాలను గుర్తించి సెక్యూరిటీ కీలక సమావేశంలో ఆమోదం పొందుతారు.
అయితే తర్వాత వచ్చే పరిణామాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నిర్ణయాలను, అలాగే సాధించవలసిన లక్ష్యాలలో మార్పుని ఒక సెక్యూరిటీ కోర్ కమిటి సమీక్షిస్తూ ఉంటుంది. దీనికి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (NSA) సమక్షంలో ఎయిర్, నేవీ, ఆర్మీ వర్గాల దళాది పతులు సమావేశం అవుతూ నిర్ణయాలు తీసుకుంటారు. లక్ష్యాలను సాధించడానికి త్రివిధ దళాలకి చెందిన infantry ని ఉపయోగిస్తారు. లక్ష్య సాధనలో ఎన్ని విమానాలు పోయాయి , ఎన్ని యుద్ధ ట్యాంకులు పోయాయి , ఎంతమంది పోయారు అనే విషయంలో గోప్యత వుంటుంది. యుద్ధం చేసేది మనం ముందుగా అనుకున్న లక్ష్యాలు సాధించడానికి అంతే కాని మన విమానాలు , యుద్ధ ట్యాంకులు మిల మిలా మెరుస్తూ దాచుకోడానికి కాదు. వాటికి సంబంధించిన నష్టం కలగడం యుద్ధంలో ఒక భాగం. అదేమి జరగ కూడని పని కాదు.
ఉదాహరణకి క్రికెట్టు ఆటలో 240 పరుగులు ప్రత్యర్ధి జట్టు చేస్తే 241 పరుగులు చేస్తే కాని విజయం సాధించలేము. అంటే చేయాల్సిన పరుగుల లక్ష్యం 241. ఇప్పుడు వికెట్లు పడకుండా పరుగుల లక్ష్యం సాధించగలమా ? అమ్మో నేను అవుట్ అయిపోతా అని బాల్ కొట్ట కుండా క్రీజ్ లో నిలబడితే లక్ష్యాన్ని సాధించ గలరా? ఎవ్వరు అవుట్ అవరు లక్ష్యాన్ని మాత్రం చేరుకోలేరు అదేమైనా గొప్ప విషయమా ? ధైర్యంగా ఆట ఆడాలి, కొన్ని వికెట్లు పోతాయి కాని లక్ష్యాన్ని సాధించాలి. అది ఆటలో విజయమంటే. చేసిన పరుగుల బట్టి విజయం నిర్ణయిస్తారు కాని పడకుండా మిగిలి ఉన్న వికెట్ల బట్టి కాదు కదా! ఎన్ని విమానాలు పోయాయో చెప్పడం లేదు, నీచమైన కుట్ర జరుగుతోంది , విపరీతమైన గోప్యత ఎందుకు? ఇలాటి ప్రశ్నలు యుద్ధమంటే ఏమిటో తెలియని వారు వేసే తెలివితక్కువ ప్రశ్నలు. ఇలాటి ప్రశ్నలు వేయడం ప్రజలలో ప్రభుత్వం మీద అపనమ్మకం ఏర్పరిచే ఉద్దేశ్యంగా పరిగణించాలి.