Dosakaya Masala Curry : దోస‌కాయ‌ల‌తో మసాలా కూర‌ను ఇలా చేస్తే.. ఒక్క ముక్క కూడా విడిచిపెట్ట‌కుండా తింటారు..

Dosakaya Masala Curry : మ‌న ఆరోగ్యానికి మేలు చేసే కూర‌గాయ‌ల్లో దోస‌కాయ ఒక‌టి. దోస‌కాయ‌ను ఆహారంగా తీసుకోవ‌డం వల్ల మ‌న్ం ఎన్నో ర‌కాల ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. దోస‌కాయ‌ల‌తో మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. దోస‌కాయ‌ల‌తో చేసే ఎటువంటి కూరైనా చాలా రుచిగా ఉంటుంది. అలాగే చాలా సుల‌భంగా కూడా వీటిని త‌యారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా చాలా సుల‌భంగా చేసుకోగ‌లిగే అలాగే ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ మ‌సాలా కూర‌ను ఎలా తయారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

దోస‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దోస‌కాయ ముక్క‌లు – పావు కిలో, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ట‌మాటా – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2,ప‌చ్చి కొబ్బరి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, నువ్వులు – ఒక టేబుల్ స్పూన్, గ‌రం మ‌సాలా – అర టీ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, ఆవాలు – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, నాన‌బెట్టిన చింత‌పండు – చిన్న నిమ్మ‌కాయంత‌.

Dosakaya Masala Curry recipe in telugu how to make it
Dosakaya Masala Curry

దోస‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో కొబ్బ‌రి ముక్క‌లు, నువ్వులు, నీళ్లు పోసి మెత్త‌ని పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర వేసి వేయించాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి, క‌రివేపాకు వేసి వేయించాలి. త‌రువాత దోస‌కాయ ముక్క‌లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత వీటిపై మూత పెట్టి దోస‌కాయ ముక్క‌ల‌ను మెత్త‌గా మ‌గ్గించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ప‌సుపు, కారం, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్, చింత‌పండు ర‌సం వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు బాగా ఉడికించాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌లిపి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర‌ను వేసి క‌లిపి మ‌రో 2 నిమిషాల‌ పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే దోస‌కాయ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దోస‌కాయ‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా మ‌సాలా కూర‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts