Healthy Foods : వయస్సు మీద పడుతున్న కొద్దీ సహజంగానే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. శరీరంలో ఉత్తేజం తగ్గుతుంది. ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పనిచేసేవారికైతే అనారోగ్య సమస్యలు ముప్పేట దాడి చేస్తుంటాయి. అందువల్ల వయస్సు పైబడుతున్న వారు కచ్చితంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా 30 ఏళ్లు వచ్చిన వారు రోజూ తీసుకునే ఆహారాల విషయంలో జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. అవేమిటంటే..
1. వయస్సు 30 ఏళ్లు దాటిన వారు రోజూ మచా టీ (Matcha Tea)ని తాగాలి. దీన్ని సూపర్ఫుడ్గా పరిగణిస్తారు. యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ఒక టీస్పూన్ మచా టీ పొడితో టీ తయారు చేసుకుని తాగితే చాలు.. పాలకూర కన్నా 60 రెట్లు ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. మచా టీలో యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. దీంతో ఆరోగ్యంగా ఉంటారు. లివర్, గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఈ వయస్సులో వచ్చే లివర్ వ్యాధులకు అడ్డుకట్ట వేయవచ్చు. అలాగే హార్ట్ ఎటాక్లు రాకుండా అడ్డుకోవచ్చు. కనుక 30 ఏళ్లు దాటిన వారు రోజూ కచ్చితంగా మచా టీ ని తాగుతుండాలి.
2. వయస్సు 30 ఏళ్లు దాటిన తరువాత స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ శృంగారం పట్ల వ్యామోహం క్రమంగా తగ్గుతుంటుంది. కనుక శృంగారంలో చురుగ్గా పాల్గొనాలన్నా.. చురుగ్గా పనిచేయాలన్నా.. రోజూ అశ్వగంధను తీసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడవచ్చు. మనస్సుకు ప్రశాంతత లభిస్తుంది. రోజూ రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో అర టీస్పూన్ అశ్వగంధ పొడిని కలిపి తాగుతుంటే ఫలితం ఉంటుంది.
3. చియా సీడ్స్లో అద్భుతమైన ఔషధగుణాలు, పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అధిక బరువును, షుగర్ లెవల్స్ ను తగ్గిస్తాయి. 30 ఏళ్లకు పైబడిన వారికి షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కనుక రోజూ చియా సీడ్స్ ను గుప్పెడు మోతాదులో నీటిలో నానబెట్టి తింటే షుగర్ రాకుండా అడ్డుకోవచ్చు.
4. చియా సీడ్స్ లాగే అవిసె గింజలు కూడా పనిచేస్తాయి. వీటిని కూడా రోజూ గుప్పెడు మోతాదులో తినవచ్చు. వీటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్, జీర్ణ సమస్యలు రాకుండా చూస్తాయి. 30 ఏళ్లకు పైబడిన వారికి ఈ గింజలు ఎంతగానో మేలు చేస్తాయి.
5. రోజూ గుప్పెడు మోతాదులో బాదం పప్పును నానబెట్టి తినాలి. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, మినరల్స్ ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతాయి. కనుక 30 ఏళ్లు దాటిన వారు బాదంపప్పును రోజూ తినాలి. దీంతో ఆరోగ్యంగా ఉండవచ్చు.
6. క్వినోవాను సూపర్ ఫుడ్గా పిలుస్తారు. 30 ఏళ్లకు పైబడిన వారు దీన్ని రోజూ తింటే జీర్ణ సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. క్వినోవాలో ఫైబర్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, అవసరమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి షుగర్ లెవల్స్ ను తగ్గించి బరువును అదుపులో ఉంచుతాయి. కనుక క్వినోవాను రోజూ తింటే మంచిది.