Kaju Mirchi Masala Curry : ధాబా స్టైల్‌లో జీడిప‌ప్పు మిర్చి మ‌సాలా క‌ర్రీ.. ఇలా చేయాలి.. చ‌పాతీల్లోకి సూప‌ర్‌గా ఉంటుంది..!

Kaju Mirchi Masala Curry : మ‌నం జీడిప‌ప్పును కూడా ఆహారంగా తీసుకుంటాము. డ్రై ఫ్రూట్స్ లో ఒక‌టైన జీడిప‌ప్పును తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరానికి కావల్సిన పోష‌కాల‌ను అందించ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా జీడిప‌ప్పు మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. జీడిప‌ప్పును నేరుగా తిన‌డంతో పాటు దీనితో మ‌నం వంట‌ల‌ను కూడా త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. జీడిప‌ప్పుతో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో కాజు మిర్చీ మ‌సాలా క‌ర్రీ కూడా ఒక‌టి.

ఇది మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో, ధాబాల‌లో ఎక్కువ‌గా ల‌భిస్తూ ఉంటుంది. జీడిప‌ప్పుతో చేసే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ‌గా రోటి వంటి వాటితో ఈ కూర‌ను క‌లిపి తింటూ ఉంటారు. ఎంతో రుచిగా క‌మ్మ‌గా ఉండే ఈ కాజు మిర్చీ మ‌సాలా క‌ర్రీని మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. రుచిగా, సుల‌భంగా కాజు మిర్చీ మ‌సాలా క‌ర్రీని ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Kaju Mirchi Masala Curry recipe in telugu make in this way
Kaju Mirchi Masala Curry

కాజు మిర్చీ మ‌సాలా క‌ర్రీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, ప‌చ్చిమిర్చి – 10, త‌రిగిన ట‌మాటాలు – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, క‌సూరి మెంతి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, కొత్తిమీర – కొద్దిగా, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, ఉప్పు – త‌గినంత‌, నూనె – 2 టేబుల్ స్పూన్స్.

మ‌సాలా పేస్ట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌చ్చి కొబ్బ‌రి ముక్క‌లు – 2 టేబుల్ స్పూన్స్, జీడిప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, సార ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, లవంగాలు – 3, యాల‌కులు – 3, జాపత్రి – చిన్న‌ది ఒక‌టి.

కాజు మిర్చీ మ‌సాలా క‌ర్రీ త‌యారీ విధానం..

ముందుగా ప‌చ్చిమిర్చిని అడ్డంగా రెండు భాగాలుగా క‌ట్ చేసి ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు జార్ లో మ‌సాలా పేస్ట్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు, కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీడిప‌ప్పు వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను వేసి వేయించాలి. వీటిని కూడా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించి వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో మ‌రి కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించాలి. వీటిని ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. వీటిని మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ఉప్పు, కారం, ప‌సుపు, ధ‌నియాల పొడి, గ‌రం మ‌సాలా వేసి క‌ల‌పాలి.

త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పేస్ట్ వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత వేయించిన ప‌చ్చిమిర్చి, జీడిపప్పు వేసి క‌ల‌పాలి. త‌రువాత ఒక గ్లాస్ నీళ్లు పోసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత కొత్తిమీర‌, క‌రివేపాకు, క‌సూరి మెంతి వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కాజు మిర్చీ మ‌సాలా క‌ర్రీ త‌యార‌వుతుంది. దీనిని అన్నం, చ‌పాతీ, పులావ్, నాన్, బ‌ట‌ర్ నాన్ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ క‌ర్రీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts