Mutton Pulusu : మ‌ట‌న్ పులుసును ఇలా చేస్తే చాలు.. ఎవ‌రైనా స‌రే లొట్ట‌లేసుకుంటూ తింటారు..!

Mutton Pulusu : మ‌ట‌న్ పులుసు.. మ‌ట‌న్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ఇది కూడా ఒక‌టి. మ‌ట‌న్ పులుసు చాలా రుచిగా ఉంటుంది. అన్నం, చ‌పాతీ, రాగి సంగ‌టి ఇలా దేనితో తినడానికైనా ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని త‌యారు చేసుకోవ‌డం కూడా చాలా సుల‌భం. బ్యాచిల‌ర్స్, మొద‌టిసారి చేసే వారు ఇలా ఎవ‌రైనా దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎక్కువ మంది ఉన్న‌ప్పుడు మ‌ట‌న్ వండాల‌నుకునే వారు దీనిని త‌యారు చేసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా, చాలా సుల‌భంగా చేసుకునే ఈ మ‌ట‌న్ పులుసును ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

మ‌ట‌న్ పులుసు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – 4 టేబుల్ స్పూన్స్, త‌రిగిన ఉల్లిపాయ‌లు – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, త‌రిగిన ట‌మాటాలు – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, ధ‌నియాలు – ఒక టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, ల‌వంగాలు – 5, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఎండుకొబ్బ‌రి ముక్క‌లు – ఒక టేబుల్ స్పూన్, గ‌స‌గ‌సాలు – ఒక టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెమ్మ‌లు – 8.

Mutton Pulusu recipe in telugu make like this for better taste
Mutton Pulusu

మ‌ట‌న్ ఉడికించ‌డానికి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మ‌ట‌న్ – అర‌కిలో, ఉప్పు – కొద్దిగా, ప‌సుపు – పావు టీస్పూన్, కారం – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, నీళ్లు – 2 గ్లాసులు.

మ‌ట‌న్ పులుసు త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో మ‌ట‌న్ ను వేసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాలు వేసి మూత పెట్టి 4 నుండి 6 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించుకోవాలి. త‌రువాత క‌ళాయిలో వెల్లుల్లి త‌ప్ప మిగిలిన మ‌సాలా ప‌దార్థాలు వేసి వేయించాలి. వీటిని చిన్న మంట‌పై దోర‌గా వేయించిన త‌రువాత జార్ లోకి తీసుకోవాలి. ఇందులోనే వెల్లుల్లి కూడా వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టుకుని ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు వేసి వేయించాలి. ఈ ట‌మాట ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించిన త‌రువాత ప‌సుపు, ఉప్పు, కారం వేసి క‌ల‌పాలి. త‌రువాత ఉడికించిన మ‌ట‌న్ ను నీటితో స‌హా వేసుకోవాలి. దీనిపై మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉడికించిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి కూర ద‌గ్గ‌ర పడే వ‌ర‌కు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే మ‌ట‌న్ పులుసు త‌యార‌వుతుంది. దీనిని చ‌పాతీ, రోటీ, ఇడ్లీ, దోశ ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ మ‌ట‌న్ పులుసును అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts