Paneer Shahi Biryani : రెస్టారెంట్ల‌లో ల‌భించే ప‌నీర్ షాహి బిర్యానీ.. ఇలా చేయండి, రుచిగా ఉంటుంది..!

Paneer Shahi Biryani : మ‌నం ప‌నీర్ తో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తూ ఉంటాము. ప‌నీర్ తో చేసుకోద‌గిన రుచిక‌ర‌మైన వంట‌కాల్లో ప‌నీర్ షాహీ బిర్యానీ కూడా ఒక‌టి. ఇది మ‌న‌కు ఎక్కువ‌గా రెస్టారెంట్ ల‌లో ల‌భిస్తుంది. అలాగే ఫంక్ష‌న్ లల్లో కూడా స‌ర్వ్ చేస్తూ ఉంటారు. పనీర్ తో చేసే ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ బిర్యానీని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో ఇలా బిర్యానీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ షాహీ బిర్యానీని ఇంట్లోనే ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప‌నీర్ షాహీ బిర్యానీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

బ్రౌన్ ఆనియ‌న్స్ – అర క‌ప్పు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ట‌మాటాలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – 2 టీ స్పూన్స్, షాహీ బిర్యానీ మ‌సాలా – ఒక‌టిన్న‌ర టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, త‌రిగిన పుదీనా – 2 టేబుల్ స్పూన్స్.

Paneer Shahi Biryani recipe in telugu make it in restaurant style
Paneer Shahi Biryani

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

అర‌గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక‌టిన్న‌ర గ్లాస్, నూనె – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 3, ల‌వంగాలు – 4, మ‌రాఠీ మొగ్గ – 1, బిర్యానీ ఆకు – 1, అనాస పువ్వు – 1, సాజీరా – కొద్దిగా, నీళ్లు – 2 లీట‌ర్లు, ఉప్పు – ఒక టేబుల్ స్పూన్.

మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు..

ప‌నీర్ – 200గ్రా., పెరుగు – 3 టేబుల్ స్పూన్స్, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, కారం – రెండున్న‌ర టీ స్పూన్స్, త‌రిగిన క‌రివేపాకు – 2రెమ్మ‌లు, నిమ్మ‌ర‌సం – ఒక టీ స్పూన్, నూనె – అర టేబుల్ స్పూన్.

ప‌నీర్ షాహీ బిర్యానీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో ప‌నీర్ ను తీసుకోవాలి. త‌రువాత ఇందులో మ్యారినేష‌న్ కు కావ‌ల్సిన ప‌దార్థాలు వేసి బాగా క‌ల‌పాలి. దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు ప‌క్క‌కు ఉంచాలి. త‌రువాత రైస్ త‌యారీకి గిన్నెలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత మ‌సాలా దినుసులు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత నీళ్లు, ఉప్పు వేసి క‌ల‌పాలి. నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. ఈ బియ్యాన్ని మ‌ధ్య‌స్థ మంట‌పై 90 శాతం ఉడికించాలి. బియ్యం ఉడుకుతుండ‌గానే అడుగు మందంగా ఉండే క‌ళాయిలో నూనె, నెయ్యి వేసి వేడి చేయాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. త‌రువాత ట‌మాటాల‌ను ఫ్యూరీలాగా చేసి వేసుకోవాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించాలి. త‌రువాత ధ‌నియాల పొడి, షాహీ బిర్యానీ మ‌సాలా వేసి క‌ల‌పాలి. మ్యారినేట్ చేసుకున్న ప‌నీర్ వేసిక‌ల‌పాలి.

దీనిని రెండు నిమిషాల పాటు వేయించిన త‌రువాత కొత్తిమీర‌,పుదీనా, పావు క‌ప్పు బ్రౌన్ ఆనియ‌న్స్ వేసి క‌ల‌పాలి. త‌రువాత ఈ ప‌నీర్ ను ఒక లేయ‌ర్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత అన్నాన్ని పూర్తిగా వ‌డ‌క‌ట్టి ప‌నీర్ పై లేయ‌ర్ గా వేసుకోవాలి. చివ‌ర‌గా అన్నంపై కొద్దిగా కొత్తిమీర‌, బ్రౌన్ ఆనియ‌న్స్ చ‌ల్లుకోవాలి. త‌రువాత మ‌రో 2 టీ స్పూన్ల నెయ్యి, నాన‌బెట్టిన కుంకుమ పువ్వు నీళ్లు వేసి మూత పెట్టాలి. దీనిని 5 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంటపై 10 నిమిషాల పాటు చిన్న మంట‌పై ద‌మ్ చేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని మ‌రో 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ప‌నీర్ షాహీ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని రైతాతో, మ‌సాలా గ్రేవీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ప‌నీర్ బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

Share
D

Recent Posts