భారతీయులు తమ వంట ఇంటి పదార్థాల్లో అల్లంను ఎప్పటి నుంచో ఉపయోగిస్తున్నారు. నిత్యం అనేక వంటకాల్లో వారు అల్లంను వేస్తుంటారు. దీంతో వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అయితే అల్లంతో శొంఠి తయారు చేస్తారు. దీని వల్ల మనకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లాన్ని పాలలో ఉడకబెట్టి తరువాత దాన్ని ఎండబెడతారు. దీంతో తయారయ్యే పదార్థాన్ని శొంఠి అంటారు. అయితే ఈ విధంగా అల్లంను తయారు చేసి తీసుకోవడం వల్ల మనకు ఇంకా ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.
* శొంఠి తీసుకోవడం వల్ల అజీర్ణం సమస్య తగ్గుతుంది. తిన్న ఆహారంలో ఉండే పోషకాలను శరీరం సులభంగా గ్రహిస్తుంది.
* శరీరంలో ఉండే శ్లేష్మం కరుగుతుంది. కంఠాన్ని శుద్ధి చేస్తుంది. గొంతు సమస్యలు పోతాయి. వాంతులు తగ్గుతాయి.
* ఆయాసం, ఉబ్బసం వ్యాధులు ఉన్న వారికి శొంఠి ఎంతగానో మేలు చేస్తుంది.
* బోదకాలు, మొలలు, కడుపుబ్బరం, పైత్యం, లివర్ సంబంధిత వ్యాధులకు శొంఠిని వాడవచ్చు.
* నీళ్ళ విరేచనాలవుతున్నప్పుడు శొంఠి పొడిని తీసుకుంటే ఫలితం ఉంటుంది.
* వాము, కరక్కాయ, శొంఠి.. ఈ మూడింటిని కలిపి బెల్లంతో నూరి తీసుకుంటే కీళ్ళవాతం
తగ్గుతుంది. విరేచనం సాఫీగా జరుగుతుంది.
* ఆముదం పప్పు, శొంఠి, చక్కెరలను సమపాళ్ళలో కలిపి తీసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
* శొంఠి, నల్ల జీలకర్రలను కలిపి బాగా నూరి మెత్తగా పొడి చేసి, తేనెలో కలిపి కుంకుడు గింజ పరిమాణంలో తీసుకుంటే పక్షవాతరోగులకు ఉపశమనం కలుగుతుంది.
* శొంఠి పొడిని నిత్యం ఆహారంలో చిటికెడు మోతాదులో తీసుకోవచ్చు. లేదా ఆ పొడిని టీ, పాలలో కలిపి తీసుకోవచ్చు.
ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం టెలిగ్రామ్లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365