పరగడుపున తీసుకోవాల్సిన అద్భుతమైన డ్రింక్స్ ఏవో తెలుసా..?

సాధారణంగా మనం ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ లేదా టీ తాగనిదే మన రోజువారీ కార్యక్రమాలను ప్రారంభించం. ఈ విధంగా చాలా మందికి కాఫీ లేదా టీ తాగనిదే మనస్సు కూడా ప్రశాంతంగా ఉండదు. చాలా మంది ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి పని కాఫీ లేదా టీ తాగడం. ఇది రోజువారీ దినచర్యలో ఒక భాగంగా మారిపోయింది. కానీ ఉదయం లేవగానే పరగడుపున కాఫీ లేదా టీ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకోసమే ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కాఫీ లేదా టీ ఎట్టి పరిస్థితిలోనూ తాగకూడదని, కాఫీ, టీల స్థానంలో నీళ్లు లేదా ఏవైనా పానీయాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఉదయం లేవగానే ఆరోగ్యకరమైన పానీయాలను తాగడం వల్ల ఏ విధమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

take these drinks on empty stomach for health

రాత్రి భోజనం చేసి పడుకున్నప్పటి నుంచి ఉదయం నిద్ర లేచే వరకు దాదాపుగా 12 గంటల సమయం పాటు మనం ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉంటాం. ఈ క్రమంలోనే ఉదయం లేవగానే కాఫీ, టీ వంటి వాటిని తాగటం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక ఉదయం లేవగానే కాఫీ, టీ లకు బదులుగా కొన్ని పానీయాలను తాగటం వలన మన శరీరం ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా ఉండటమే కాకుండా మన శరీరానికి కావాల్సిన తక్షణ శక్తి అందుతుంది.

* ప్రతి రోజూ ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోధుమ గడ్డి రసాన్ని పరగడుపునే తాగాలి. లేదా కొద్దిగా గోధుమ గడ్డి పొడిని ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కలుపుకుని కూడా తాగవచ్చు. దీని వల్ల శరీరానికి పోషకాలు, శక్తి లభిస్తాయి.

* నిమ్మకాయ నీళ్లను కూడా ప్రతి రోజు ఉదయం లేవగానే తాగడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

* గోరువెచ్చని గ్లాస్ నీటిలో కొద్దిగా నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ తేనె, అల్లం రసం కలుపుకొని తాగాలి.

* ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం, అల్లం రసం, దాల్చిన చెక్క పొడి, తేనె కలిపి తాగటం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

* నిమ్మరసంలో ఒక టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్, అల్లం రసం, వెల్లుల్లి రసం, తేనె, దాల్చినచెక్క పొడిని కొద్ది కొద్దిగా కలిపి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.

* ఒక గ్లాస్‌ గోరువెచ్చని నీటిలో రెండు చుక్కల తులసి రసం కలుపుకొని తాగాలి.

పైన తెలిపిన పానీయాలలో మీకు నచ్చిన దాన్ని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగటం వల్ల మన శరీర మెటబాలిజం పెరుగుతుంది. తద్వారా జీర్ణక్రియ సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది. శరీరానికి పోషకాలు, శక్తి లభిస్తాయి.

Share
Sailaja N

Recent Posts