ప్రధానంగా శరీర కండరాలలో, కొవ్వు కణాలలో ఇన్సులిన్ నిరోధకత తగ్గిపోవడంతోను, బీటా సెల్స్ నుండి తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడంతోను టైప్ 2 డయాబెటీస్ ఏర్పడుతుంది. అయితే, దీనికి తోడుగా లివర్ లో గ్లూకోజ్ కూడా రిలీజ్ అధికమవటంకూడా జరుగుతుంది. అపుడు దీనిని బ్లడ్ షుగర్ గా పిలుస్తారు. మరో ప్రధాన చర్యగా కొవ్వు కణాలలోని లిపిడ్లు అధికంగా విచ్ఛిన్నం అవుతాయి. రక్తంలో అధిక గ్లూకోజన్ స్ధాయిలు ఏర్పడతాయి. కిడ్నీలలో ద్రవాలు అధికంగా పీల్చబడతాయి.
ఇక సెంట్రల్ నెర్వస్ సిస్టం జీవప్రక్రియను సరిగా నియంత్రించలేదు. ఇక ఈ పరిస్ధితులలో షుగర్ వ్యాధి బారిన పడినట్లుగా భావించాలి. షుగర్ వ్యాధి వారికి టెస్టులను ఏ ఆహారం తినకుండా అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అని, తిన్న తర్వాత షుమారుగా రెండుగంటలకు పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ అని నిర్వహిస్తారు. బ్లడ్ షుగర్ టెస్టులలో ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కు అధిక ప్రాధాన్యతనిస్తారు. లక్షణాలు ఎన్ని చూపినప్పటికి, సరైన పద్ధతిలో చేసే పరీక్షల వలన మాత్రమే షుగర్ వ్యాధి నిర్ధారించబడుతుంది.
ఇప్పటికి అమెరికాలో 20 శాతం మంది ప్రజలకు తాము ఈ వ్యాధి బారిన పడినట్లుగా కూడా గుర్తించలేకుండా వున్నారు. దీనిని బట్టి ఈ వ్యాధి మనకు తెలియకుండానే శరీరంలో ప్రవేశించి అన్ని భాగాలను ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. కనుక షుగర్ వ్యాధి గలవారు ఎప్పటికపుడు పరీక్షలు చేయించుకుంటూ దానిని నియంత్రణలో వుంచుకునేటందుకుగాను సరైన ఔషధాలు, వ్యాయామం, ఆహారం వంటివి మెయిన్టెయిన్ చేయాలి.