మన దేశంలో ఎవరైనా వైద్యుడి గా ప్రాక్టీస్ (దీనర్థం ఒక పారాసెటమాల్ ప్రిస్క్రైబ్ చేయాలన్నా ) అందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లో రిజిస్టర్ అయ్యుండాలి. ఆ రిజిస్ట్రేషన్ సంఖ్య ప్రిస్క్రిప్షన్ లెటర్ పైన ఉంటుంది.ఎంబీబీస్ పాసైనా ఒక ప్రొవిషనల్ రిజిస్ట్రేషన్ నంబర్ ఇస్తారు. దానితో ఒక సంవత్సరం ఏదైనా ఎం.సీ .ఐ చే ఆమోదింపబడిన వైద్యశాల లో అన్ని విభాగాలలో ఇంటర్న్షిప్ చేసిన తరువాత ఎంబీబీస్ డిగ్రీని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా చేసుకున్న వైద్యులను రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీటిషనర్ (R.M.P) అంటారు.
ఇతర దేశాలలో ఎంబీబీస్ చేసినా ముందు మన దేశంలో పైన చెప్పినట్లుగా ఇంటర్న్షిప్ చేసిన తరువాతనే ఎం.సి.ఐ లో రిజిస్ట్రేషన్ చేసుకునే వీలుంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ప్రాక్టీస్ చేయడం చట్టవ్యతిరేకం. ఇక గ్రామాల్లో, చిన్న ఊర్ల లో ఎంబీబీస్ డిగ్రీ లేకుండానే, ఒక bridge కోర్స్ లాంటివి చేసి, రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీటిషనర్ (R.M.P) అని చెప్పుకునే వాళ్లు ఉన్నారు. గ్రామాల్లో చికిత్స చెయ్యడానికి ప్రభుత్వం వైద్యులకు మంచి వేతనాలు, వైద్యశాలల్లో సౌకర్యాలు ఇవ్వడం లేదు., హైస్కూల్ చదువుకున్నవారు కూడా RMP అని , ప్రజలకు చికిత్స చేసేస్తున్నారు.
ఆరేళ్ళు ఎంబీబీస్ చదివి, పాసైనా కూడా, ఇంటర్న్షిప్ చేస్తేకాని ప్రాక్టీస్ చేసే హక్కు రాదు కానీ, స్కూల్ పాసైన వ్యక్తి బ్రిడ్జి కోర్స్ చేస్తే ప్రాక్టీస్ చెయ్యొచ్చు. ఇదెక్కడి న్యాయం? ఇప్పుడు చిన్నచిన్న ఊర్ల లో, ఎవరు ప్రాక్టీస్ చేస్తున్నారు? వారి విద్యార్హతలేంటి అని అడిగే నాథుడే లేడు. ఈ quacks చేసే దుశ్చర్యలు చెప్పడానికి వేరే సమాధానమే రాయాలి. మన ఆరోగ్యం, ప్రాణాలకంటే ముఖ్యమైంది ఏదీ లేదు.పల్లెల్లో ఉండేవాళ్ళు అప్రమత్తంగా ఉండి, చట్టరిత్యా చికిత్స చేసే హక్కు లేనివారి దగ్గరకు వెళ్లకూడదు. ఆర్ఎంపీలకు సాధారణంగా కేవలం ప్రథమ చికిత్స చేసేందుకు మాత్రమే అనుమతి ఉంటుంది. కానీ మందులను ఇచ్చే అర్హత లేదు. అయిప్పటికీ చాలా మంది ఆర్ఎంపీలు ఏకంగా ఇంజెక్షన్లు వేస్తుంటారు.