బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఒక మహిళ 87 వేల రూపాయలని కోల్పోయారు. లోంజ్ ఫెసిలిటీని తీసుకోవాలని వెళ్ళిన ఆమె ఈ స్కామ్ లో ఇరుక్కున్నారు. ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 29న ఇది చోటు చేసుకుంది అని ఆమె చెప్పింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఇది చోటు చేసుకుందని.. ఈమె విమానాశ్రయానికి ఐదు గంటల ముందు వెళ్లానని.. ఎయిర్ పోర్ట్ లోంజ్ లో రిలాక్స్ అవుదామని వెళ్లానని.. క్రెడిట్ కార్డ్ ఫిజికల్ గా లేకపోవడం వలన ఫోన్లో క్రెడిట్ కార్డు ఫోటో చూపించి లోంజ్ లోకి వెళ్ళినట్లు చెప్పారు.
క్రెడిట్ కార్డ్ స్కాన్ చేసిన తర్వాత లోంజ్ పాస్ అనే యాప్ ని ఎక్కించుకోమని చెప్పారని.. ఫేషియల్ రికగ్నిషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఏదో తేడాగా అనిపించిందని ఆమె చెప్పారు. స్టార్బక్స్ కాఫీ ఒకటి తీసుకుని లోంజ్లోకి వెళ్లకుండానే వచ్చేసినట్లు ఆమె చెప్పారు. కొన్ని రోజుల తర్వాత ఆమెకి ఫోన్ చేస్తుంటే అవ్వట్లేదు అని తన స్నేహితులు చెప్పారట.
క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ వచ్చాక 87 వేల రూపాయలు ఫోన్ పే అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ అయినట్లు ఆమెకి తెలిసింది. లోంజ్ పాస్ యాప్ ద్వారా స్కామర్లు ఇలా చేసినట్లు ఆమె అనుమానించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వాళ్లే ఫోన్ చేసి సెట్టింగ్స్ మార్చి ఓటీపీలు కూడ ఎంటర్ చేసి ఉండొచ్చని ఆమె అన్నారు.