భారతదేశంలో చాలామంది జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్ముకుంటూ ఉంటారు. ఈ శాస్త్రం ప్రకారం ఏ పనైనా చేస్తూ ఉంటారు. పుట్టిన పిల్లాడి నుంచి చచ్చే మనిషి వరకు ఏ కార్యక్రమాలు చేయాలన్న జ్యోతిష్యాన్ని నమ్ముకునే చేస్తూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం వాస్తును ఫాలో అయితే ఎలాంటి బాధ ఉండదని నమ్ముతారు. వాస్తు శాస్త్రం వల్ల పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుందని భావిస్తారు. ఈ క్రమంలోనే కొంతమంది జ్యోతిష్య నిపుణులు కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్పారు.
ఈ విషయాలను ఫాలో అయితే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని భావిస్తారు. చాలామంది పర్సు మెయింటైన్ చేస్తూ ఉంటారు. అందులో వారికి నచ్చిన వాటిని పెడుతుంటారు. కానీ పర్సు విషయంలో ఈ తప్పులను చేయొద్దని కొంతమంది పండితులు అంటున్నారు. సాధారణంగా పర్సులో డబ్బులతో పాటు మిగతా ఇంపార్టెంట్ వస్తువులను పెడుతూ ఉంటాం. కానీ పర్సులో అవి అసలు పెట్టకూడదని అంటారు.
లక్ష్మీదేవి కనక మీ ఇంట ఉండాలంటే మీ పర్సులో అవసరం లేనివి ఉంచకండి . ఈ విధంగా చేస్తే పాజిటివ్ ఎనర్జీ కలిగి, నెగిటివ్ ఎనర్జీ దూరమవుతుందని అంటారు. చిరిగిపోయిన నోట్లను కూడా పెట్టకూడదని అంటారు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని పండితులు అంటున్నారు. మరి ఇప్పటినుంచి పెట్టకండి సమస్యల పాలు కాకండి అని జ్యోతిష్య నిపునులు అంటున్నారు.