పూర్వం రోజుల్లో బాల్య వివాహాలు జరిపించే వారు. కానీ కాలం మారిన కొద్దీ అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు నిండిన తరువాతే వివాహం చేయడం మొదలు పెట్టారు. అయితే ఇప్పుడు పోటీ ప్రపంచం నడుస్తుంది కనుక ఇద్దరికీ వివాహం జరగడం ఆలస్యం అవుతోంది. కెరీర్లో సెటిల్ అయ్యాకే పెళ్లి అంటూ 30 ఏళ్లు దాటినా కూడా వివాహం చేసుకోవడం లేదు. దీంతో వివాహం ఆలస్యం అవుతోంది. అయితే ఆ తరువాత పెళ్లి చేసుకుందాం అంటే వీలు కుదరడం లేదు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి.
సరైన జోడీ దొరకడం లేదనే చాలా మందికి పెళ్లి జరగడం లేదు. అయితే కింద చెప్పిన మంత్రాన్ని పఠిస్తే అమ్మాయి లేదా అబ్బాయికి వివాహం త్వరగా జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఇక ఆ మంత్రం ఏమిటంటే..
కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే…! నమః కామవిహారాయ కామ రూప ధరాయచ…!!
వివాహం కాని స్త్రీలు గానీ, పురుషులుగానీ ఈ శ్లోకాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు మండలం పాటు ఏక దీక్షతో పఠిస్తే వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఒకరి పట్ల ఒకరికి అనురాగం లోపించిన భార్యా భర్తలు ప్రతినిత్యం ఈ శ్లోకం పదకొండు సార్లు చొప్పున పఠిస్తూ వుంటే వారిద్దరి మధ్యన ఉన్న దూరం తగ్గి ఒకరిపై మరొకరికి అనురాగం పెరుగుతుంది.