నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ ఆఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలకపాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది.
ఈ అఖండ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మైమరపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ పాత్ర బాలయ్య తప్ప మరెవరు చేయలేరు అంటూ పలువురు ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా ఓటిటి లోనూ తన హవాను ప్రదర్శించింది. అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో బోయపాటి ఓ చిన్న మిస్టేక్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.
సినిమాలో ఫైట్ సీన్ జరిగే సందర్భంలో ఓ నటుడు విలన్ పక్కన గూండాగా కనిపించాడు. అయితే అదే గుండాగా నటించిన నటుడు మళ్ళీ పోలీస్ గా కనిపించాడు. ఒకే సినిమాలో బోయపాటి శ్రీను ఆ నటుడికి రెండు పాత్రలు ఇచ్చి దొరికిపోయాడు. దాంతో అక్కడ పోలీసు, ఇక్కడ దొంగ అంటూ బోయపాటి పై నేటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.