ఇటీవలి కాలంలో మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పోల్చితే సోషల్ మీడియా హవా ఓ రేంజ్ లో ఉంది. సోషల్ మీడియా వచ్చాక ప్రతి వార్త సామాన్యులకి త్వరగా అందుతుంది. అలాగే వారి సందేశాలు కూడా నేరుగా సెలబ్రిటీలకు చేరుకుంటున్నాయి. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే.. శ్రీమంతుడు నుంచి బలగం వరకు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం.
పాండవులు పాండవులు తుమ్మెద.. మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీకి శ్రీనివాస్ దర్శకుడు. ఈ సినిమా కథని హిందీలో రూపొందిన గోల్ మాల్ 3 నుండి లేపేసారు. అందుకే గోల్ మాల్ 3 నిర్మాతలు పాండవులు పాండవులు తుమ్మెద నిర్మాతలైన మంచు ఫ్యామిలీపై కేసు వేయగా, న్యాయస్థానం మంచు ఫ్యామిలీకి రూ.90 లక్షలు జరిమానా విధించడం జరిగింది. అంతేకాదు కొన్నాళ్లపాటు పాండవులు పాండవులు తుమ్మెద డబ్బింగ్ రైట్స్ ను కూడా అమ్మకూడదు అని స్టే విధించింది. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ చిత్రం కథ నాదే, నారా రోహిత్ తో ఈ కథతో సినిమా తీద్దాం అనుకుంటే కొరటాల నా కథను దొబ్బేసి సినిమా చేశారు అంటూ శరత్ చంద్ర అనే వ్యక్తి తెలుగు సినిమా రచయితల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కోర్టుకు ఎక్కడం కూడా జరిగింది.
మీనా అనే నవల ఆధారంగా అ..ఆ.. చిత్రాన్ని రూపొందించి క్రెడిట్స్ ఇవ్వలేదు అంటూ అప్పట్లో ఈ సినిమా యూనిట్ పై ఫిర్యాదు చేయడం అది సంచలనంగా మారడం జరిగింది. అజ్ఞాతవాసి.. లార్గోవించ్ అనే ఫ్రెంచ్ మూవీని ఆధారం చేసుకుని ఈ సినిమా తీసినట్టు ఆ చిత్ర నిర్మాతలు వీరిపై కేసు వేయడం, ఆ తర్వాత రూ. 20 కోట్లు ఫైన్ వేయడం జరిగింది. కానీ ఆ తర్వాత రాజీ కుదురుచుకుని కట్టలేదు అని సమాచారం. అజ్ఞాతవాసి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది. నిను వీడని నీడను నేనే.. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ మూవీని ఓ షార్ట్ ఫిలిం నుండి కాఫీ కొట్టారని, సినిమా విడుదల రోజున ఆరోపణలు వినిపించాయి. కానీ తర్వాత కథ వేరు, ఈ కథ వేరు అని లైట్ తీసుకున్నారు. ఇస్మార్ట్ శంకర్.. ఒకప్పటి హీరో ఆకాష్, తాను తీసిన కొత్తగా ఉన్నాడు అనే సినిమాని కాపీ కొట్టి పూరి ఇస్మార్ట్ శంకర్ తీశాడని అతను మీడియాకెక్కాడు. తర్వాత ఏమైందో ఏమో సైలెంట్ అయిపోయాడు.
ఆచార్య.. ఈ సినిమా రిలీజ్ కాకుండానే కథ నాది కొరటాల కాపీ కొట్టేశాడు అంటూ ఓ వ్యక్తి ఆరోపణలు చేశాడు. తర్వాత సైలెంట్ అయిపోయాడు. సినిమా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అవ్వడం కూడా జరిగింది. క్రాక్.. తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందిన సేతుపతి రైట్స్ తాను కొనుగోలు చేస్తే, విలన్ క్యారెక్టర్ ను మార్చేసి క్రాక్ గా తీశాడు దర్శకుడు గోపీచంద్ మలినేని అంటూ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఆరోపించారు. రైటర్ పద్మభూషణ్.. సుహాస్ హీరోగా వచ్చిన సినిమా ఇది. బరేలికి బర్ఫీ అనే బాలీవుడ్ సినిమాని కాపీ కొట్టి ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. బలగం.. ఈ మూవీకి క్రిటిక్స్ నుండి అలాగే ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. అయితే ఈ కథ నాది అంటూ ఓ జర్నలిస్టు మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.