కూల్ డ్రింక్ లేదా సోడాలు అధికంగా తాగితే కిడ్నీలు దెబ్బతింటాయి. రోజుకు ఒకటికి మించి తాగరాదు. ఇప్పటికే కిడ్నీ సమస్యలున్నవారు తక్షణం కూల్ డ్రింక్ లేదా సోడా తాగటం మానేయటం మంచిది. కూల్ డ్రింక్ లో వుండే ఫాస్పారిక్ యాసిడ్ ఎముకల్లో వున్న కాల్షియంను తినేస్తుంది. మూత్రం ద్వారా కాల్షియం బయటకు వచ్చేస్తుంది. ఇది మెల్లగా కిడ్నీలో స్టోన్ గా కూడా ఏర్పడుతుంది. కూల్ డ్రింక్ లేదా సోడా తాగితే శరీరంలో నీరు తగ్గిపోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది.
వీటిలో వుండే కేఫైన్, షుగర్ డీ హైడ్రేషన్ కలిగిస్తాయి. ఢీహైడ్రేషన్ కిడ్నీలను నష్టపరుస్తుంది. కూల్ డ్రింక్ లు శరీర బరువును పెంచి రక్తపోటును అధికం చేస్తాయి. దీనితో గుండెజబ్బులు వచ్చే ప్రమాదం వుంది. కూల్ డ్రింక్ లలో వుండే షుగర్, యాసిడ్లు, పంటి ఎనామిల్ కు కూడా హాని చేస్తాయి.
రీసెర్చర్ల మేరకు కూల్ డ్రింకులు కిడ్నీలను నష్టపరచటమే కాక లివర్ సిర్రోసిస్ వ్యాధిని కలిగిస్తాయని కూడా వెల్లడైంది. కనుక, ఇకపై కూల్ డ్రింకులకు సోడాలకు స్వస్తి చెప్పి వాటి స్ధానంలో ఆరోగ్యాన్నిచ్చే పండ్ల రసాలు తాగితే శరీరానికి మంచి పోషణ లభించినట్లవుతుంది. అన్నిటికి మించి కిడ్నీకి లాభాన్నిచ్చేది మంచినీరు తాగటం అని కూడా గుర్తుంచుకోండి.