ఈ సంఘటన గురించి చాలా మంది భారతీయులు విని కూడా ఉండరు. ఇది 1999లో అప్పటి భారత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య బస్సు సర్వీసును ప్రారంభించినప్పుడు జరిగింది. అమృత్సర్-లాహోర్ బస్సు సర్వీసు ప్రారంభోత్సవం సందర్భంగా, ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి స్వయంగా బస్సు ఎక్కి లాహోర్కు ప్రయాణించారు. ఆయనకు పాకిస్తాన్లో ఘన స్వాగతం లభించింది. ఈ సమయంలో, ఆయన గవర్నర్ సభలో కూడా ఒక అద్భుతమైన ప్రసంగం చేసి, పాకిస్తాన్ను మందలించారు, మీరు పొరుగువారిని కాదు, స్నేహితులను మార్చచ్చు.
ప్రసంగం తర్వాత, ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ (మహిళ) ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని ప్రశ్నలు అడగడం ద్వారా కాశ్మీర్ సమస్యను తెలివిగా లేవనెత్తారు. ఆ జర్నలిస్ట్ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయిని మీరు ఇంతవరకు ఎందుకు వివాహం చేసుకోలేదు? అని అడిగారు, ఆమె ఇంకా ఇలా చెప్పింది- నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నా ముహ్ దిఖాయిలో (కన్యా శుల్కం)గా నాకు కాశ్మీర్ ఇవ్వాలనే షరతు.
జర్నలిస్ట్ మాట విన్న తర్వాత అటల్ జీ నవ్వి, నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నాకు మొత్తం పాకిస్తాన్ కట్నం కావాలి అని జవాబిచ్చారు. (ముహ్ దిఖాయి వేడుక ప్రాథమికంగా నూతన వధువును కుటుంబ సభ్యులు, బంధువులు మరియు సన్నిహిత స్నేహితులకు పరిచయం చేసే ఒక ఆచారం. ఈ వేడుకలో, ప్రతి సభ్యుడు నూతన వధువుకు బహుమతులు మరియు ఆశీర్వాదాలను అందిస్తారు). దీంతో అవాక్కవడం ఆ జర్నలిస్టు వంతు అయింది.