అధిక బరువు తగ్గించుకోవాలనుకునేవారు సింపుల్ గా చేయాల్సింది….వ్యాయామాలు చేయటం కంటే కూడా తక్కువగా తినాలని పేరొందిన ఇంగ్లండ్ దేశంలోని వైద్యులు లార్డ్ మెకల్ చెపుతున్నారు. అధిక బరువును అధిగమించాలంటే, ఇంగ్లాండ్ దేశంలో ప్రభుత్వం చేపడుతున్న వ్యాయామాల కార్యక్రమాలను కూడా ఈయన విమర్శించారు. రెగ్యులర్ గా వ్యాయామాలు చేస్తే మొండి వ్యాధులు….గుండె సంబంధిత వ్యాధులు మరియు టైప్ 2 డయాబెటీస్ వంటివి కూడా తగ్గుముఖం పడతాయని పరిశోధనలు శాస్త్రీయంగా నిరూపించినప్పటికి ఈయన వ్యాయామాలపై తన విమర్శలు చేశారు.
రెగ్యులర్ వ్యాయామాలు తమ పట్ల విశ్వాసాన్ని, మంచి భావనల్ని, నిద్రను, తగినంత శక్తిని ఇస్తాయని, ఒత్తిడి, డిప్రెషన్, మతిమరపు, అల్జీమర్స్ వంటి వ్యాధులు కూడా తగ్గిస్తాయని రుజువైనప్పటికి, ఈయన ఆ వాదనలను తోసిపుచ్చారు. గత నూరు సంవత్సరాల కాలంలో ఎపుడూ లేనంతగా, నేటికి ఇంగ్లాండ్ దేశం ఒక తీవ్రమైన అంటువ్యాధి కలిగి వుందని…అది అధిక బరువు సమస్య అని, దీనికి నివారణ ఒకే ఒకటని …అది తక్కువగా తినటమేనని కూడా పేరొందిన ఈ శస్త్రవైద్యులు తెలిపినట్లు ది డైలీ మెయిల్ వార్తాపత్రిక ప్రచురించింది.
ఇక మన ఆయుర్వేద వైద్యంలో కూడా దాదాపుగా ఇలాగే చెప్పారు. తక్కువ ఆహారం తింటే ఎక్కువ రోజులు జీవిస్తారని, ఆయుర్దాయం పెరుగుతుందని, ఆహారం అధికంగా తింటే త్వరగా వృద్ధాప్య ఛాయలు వస్తాయని, దీంతో త్వరగా చనిపోయే అవకాశాలు అధికంగా ఉంటాయని చెప్పారు. కనుక ఆహారాన్ని తక్కువగా తినాలి. ఆకలిగా ఉంటేనే తినాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు.