మీకు కూడా సినీనటులు ఐశ్వర్యారాయ్, రాణీ ముఖర్జీలకున్నటువంటి అందమైన కళ్ళు వుండాలని కోరుకుంటున్నారా? అయితే, దిగువ చెప్పే సింపుల్ డైట్ ఆచరించండి. ఆరోగ్యకర ఆహారం, మంచి నిద్ర, కొన్ని సహజ వైద్యాలు మీ కళ్ళకు మంటలు, ఎరుపు ఇతర అసౌకర్యాలను దూరంగా వుంచుతాయి. కళ్ళు అందంగా కనపడాలంటే, కంటి చూపు బాగుండాలంటే ఏం తినాలో చూద్దాం! కంటికి అవసరమైన విటమిన్లు – ఎ,ఇ, సి మొదలైనవి మీ దైనందిన ఆహారంలో తప్పక వుండాలి. కేరట్లు, ఆపిల్స్, కివి పండు, విటమిన్ సి పండ్లు అయిన ఆరెంజ్, బత్తాయి, నిమ్మ, రేగుపండు మొదలైనవి తినండి.
కళ్ళు తేలికగా, ఒత్తిడి లేకుండా వుండాలంటే, దోసకాయల రసం, పొట్లరసం, బూడిదగుమ్మడి రసం, ఒక్క చెంచాడు ఆముదం లేదా ఐస్ వేసిన నీరు బాగా పని చేస్తాయి. ఒత్తిడి కళ్ళ కారణంగా కలిగిన తలనొప్పి, గిడ్డినెస్ వ్యాధులు కూడా తగ్గిస్తాయి. విటమిన్ ఎ అదికంగా వుండే నీటిలోనానపెట్టి తొక్క తీసిన బాదం పప్పులు, ఖర్జూరాలు, సోయా బీన్స్, గ్రీన్ బఠాణీలు కళ్ళకు మంచి పోషకాహారం కాగలవు. పచ్చని ఆకు కూరలైన గోంగూర, కేబేజి, తోటకూర, మొదలైనవి ఎర్ర కణాలను పెంచి కంటి చూపును మెరుగుపరుస్తాయి.
పాల ఉత్పత్తులైన, వెన్న, పాలు, జున్ను, మజ్జిగ మొదలైనవి కూడా కంటికి మంచివి. అవి కళ్ళ ఒత్తిడిని తగ్గిస్తాయి. తులసి, త్రిఫల మొక్కల ఆకుల రసాలు కంటి సమస్యలు నివారించటానికి ఆయుర్వేదంలో మంచి ఔషధాలుగా చెప్పబడ్డాయి. వీటిలో వుండే ఔషద గుణాలు కంటికి చాలా మంచివే కనుక వీటి రసాన్ని నీరు, తేనెలతో కలిపి తీసుకోమని కూడా వైద్యులు చెపుతారు. అందం ఆరోగ్యం గల కళ్ళకు మంచి పోషకాహారం, రెగ్యులర్ వ్యాయామం, దుమ్ము నుండి రక్షణ వుంటే చాలు.