మహేష్ బాబు, పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొనే స్టార్ హీరోస్, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రవేశంతో సినిమాలను సరిగ్గా చేయడం లేదు. మహేష్ బాబు ఎక్కువ యాడ్స్ లో కూడా నటించాడు. కానీ వీరిద్దరికంటే ఎక్కువగా సంపాదించాడు హీరో సచిన్ జోషి… పేరు ఎక్కడో విన్నట్టు ఉంది కదా, ఇతను చేసిన సినిమాలు చాలా తక్కువ, మౌనమేలనోయి,ఒరేయ్ పండు, నిను చూడక నేనుండలేను అనే సినిమాల్లో నటించాడు సచిన్ జోషి, ఇవి చాల సంవత్సరాల ముందు రిలీజ్ అయ్యాయి,గతంలో నీ జతగా నేనుండాలి అనే సినిమా లో హీరో గా నటించాడు, హిందీ లో సూపర్ హిట్ అయిన ఆషీకీ-2 చిత్రాన్ని తెలుగు లో నీ జతగా నేనుండాలి గా రీమేక్ చేసారు, నీ జతగా నేనుండాలి సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ సినిమా రిలీజ్ అయ్యాక బండ్ల గణేష్, సచిన్ జోషి ల మధ్య చాలానే కొట్లాటలు జరిగాయి.
సినిమాలకి రాకముందు నుండే సచిన్ జోషి ధనవంతుడు. గతంలో కింగ్ ఫిషర్ విల్లాను కొనుకున్నది కూడా ఈ సచిన్ జోషినే.. 73 కోట్ల రూపాయలకు ఈ విల్లా ను కొనుక్కునాడు, తనకు ఏ కార్ నచ్చితే ఆ కార్ కొనేస్తాడు. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు టీం తరుపున ఆడతాడు, సెలబ్రిటీ క్రికెట్ లీగ్ వల్ల కొంచెం పేరు వచ్చింది సచిన్ జోషి కి.
తనకి సినిమాలు కేవలం హాబీ మాత్రమే, సినిమా విజయవంతం అయ్యిందా లేదా అనేది అతనికి అనవసరం. సచిన్ జోషి చెయ్యని వ్యాపారం లేదు.. పొద్దున్న ఒక దేశం లో ఉంటె, మధ్యాహ్నం ఇంకో దేశం లో ఉంటాడు … డబ్బులని ఇష్టం వచ్చినట్టు ఖర్చుపెడుతూ ఉంటాడు. సచిన్ జోషి భార్య కూడా సినిమాల్లో నటించింది, ఆమె పేరు ఊర్వశిశర్మ .. ధనం మూలం ఇదం జగత్ అంటే ఇదేనేమో.