పసుపు మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగించే పదార్థం. దీని వల్ల వంటకాలకు చక్కని రుచి వస్తుంది. అంతేకాదు, పసుపును మన పెద్దలు యాంటీ సెప్టిక్గా, గాయాలు మానేందుకు కూడా వాడుతారు. ఇక నిమ్మరసం. దీన్ని కూడా మనం వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తాం. ముఖ్యంగా నిమ్మరసం, చక్కెరను నీటిలో కలుపుకుని షర్బత్లా తాగితే శరీరానికి చల్లదనం చేకూరుతుంది. అయితే పసుపు, నిమ్మరసంలను ఉపయోగించి బరువు తగ్గవచ్చనే సంగతి తెలుసా..? బరువే కాదు, పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మపండు రసాన్ని, 1/4 టీస్పూన్ పసుపును మిక్స్ చేయాలి. రెండూ మిక్స్ చేసిన తర్వాత కావాలనుకుంటే అందులో కొద్దిగా తేనె కలపవచ్చు. అలా మూడింటినీ కలిపిన ఆ నీటిని గోరువెచ్చగా ఉండగానే ఉదయాన్నే పరగడుపున తాగాలి. రోజుకు రెండు సార్లు ఈ మిశ్రమం తాగితే వారం రోజుల్లోనే ఫలితం కనిపిస్తుంది. బరువు తగ్గేవరకు లేదంటే పొట్ట దగ్గర కొవ్వు కరిగే వరకు ఈ మిశ్రమాన్ని తాగవచ్చు. ఒక నిమ్మకాయను పూర్తిగా పిండి అందులో నుంచి రసాన్ని తీయాలి. దానికి అర టీస్పూన్ పసుపు, 1/4 టీస్పూన్ నల్ల మిరియాల పొడి, 1/4 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ను కలపాలి. బాగా కలిపాక వచ్చే మిశ్రమాన్ని 1 లేదా 2 టీస్పూన్ల మోతాదులో రోజుకు 3 పూటలా భోజనం చేశాక తీసుకోవాలి. దీంతో కొవ్వు వేగంగా కరుగుతుంది. పొట్ట కూడా తగ్గుతుంది.
సన్నని మంట మీద ఒక కప్పు పాలను బాగా వేడి చేయాలి. తర్వాత అందులో అరటీస్పూన్ నిమ్మరసం, అరటీస్పూన్ తేనె మిక్స్ చేయాలి. దీంతోపాటు వెనీలా ఎక్స్ ట్రాక్ట్ ను కూడా కలపాలి. అనంతరం ఆ మిశ్రమంలో అరటీస్పూన్ పసుపు కూడా మిక్స్ చేసి, తక్కువ మంట మీద వేడి చేయాలి. తర్వాత క్రిందికి దింపుకుని వడగట్టి గోరువెచ్చగా తాగాలి. ఈ డ్రింక్ను వారం పాటు తాగితే ఫలితం మీకే తెలుస్తుంది. దీన్ని భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత తీసుకోవచ్చు. అధిక బరువును తగ్గించుకోవాలన్నా, కొవ్వును కరిగించుకోవాలన్నా పసుపు, నిమ్మరసంను తరచూ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ రెండింటినీ సలాడ్స్లో కూడా కలిపి తీసుకోవచ్చు. దీంతో అధిక బరువు తగ్గుతారు. పొట్ట కరిగిపోతుంది.
గౌట్, కిడ్నీ స్టోన్స్ లేదా గాల్ బ్లాడర్ స్టోన్స్ తో బాధపడే వారు ఈ మిశ్రమాలను తీసుకోకూడదు. సర్జరీ చేయించుకున్నవారు కూడా తీసుకోకూడదు. డాక్టర్ ను సంప్రదించి తీసుకోవచ్చు. అలాగే పాలిచ్చే తల్లులు, గర్భంతో ఉన్న మహిళలు కూడా ఈ మిశ్రమాలను తీసుకోకపోవడమే మంచిది.