హిందూ సంప్రదాయం లో దీపారాధనకి చాలా ప్రాముఖ్యత ఉంది. దైవ ఆరాధన లో దీపారాధన చాలా ముఖ్యమైనది. దేవుడ్ని ప్రార్ధించేముందు, ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించడానికి ముందు దీపం వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. అజ్ఞానం అనే చీకట్లను పారద్రోలి, జ్ఞానం అనే వెలుగులోకి నడిపించమని ప్రార్ధిస్తూ దేవుడి ముందు దీపం వెలిగించి వేడుకుంటారు.
అయితే దీపం వెలిగించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. ఇప్పుడు అవేంటో తెలుసుకుని అలా జరగకుండా జాగ్రత్త పడండి. స్టీలు కుందులో దీపారాధన చేయరాదు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. ఒకవత్తి దీపాన్ని చేయరాదు. ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు.
దీపాన్ని అగరవత్తితో వెలిగించాలి. దీపారాధన కుందికి మూడుచోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేయాలి. విష్ణువుకు కుడివైపు దీపం ఉండాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమఃశ్శివాయ అని జపించి దీపం వెలిగించాలి.