టాలీవుడ్ అగ్ర హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు. తన అద్భుతమైన నటన, స్టైలిష్ డాన్స్ తో కోట్లాదిమంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారు చిరంజీవి.
అయితే బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం అప్పట్లో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటించింది. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. అంతేకాకుండా ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ చిత్రం విడుదలైన సందర్భంలో అప్పట్లో ప్రమోషన్లలో భాగంగా బుల్లితెరపై కూడా సందడి చేశారు మెగాస్టార్. టాలీవుడ్ స్టార్ యాంకర్ సుమ హోస్ట్ గా వ్యవహరించిన సుమ అడ్డ షోకి అతిథిగా విచ్చేశారు. చిరుతో పాటు దర్శకుడు బాబి, కమెడియన్ వెన్నెల కిషోర్, జబర్దస్త్ గెటప్ శ్రీను కూడా ఈ షోలో పాల్గొని సందడి చేశారు. అయితే ఈ షోలో సుమ చిరంజీవికి కొన్ని సరదా ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా చిరంజీవి సతీమణి సురేఖ గురించి ఎవరికీ తెలియని విషయాలను రాబట్టేందుకు ప్రయత్నం చేసింది సుమా. ఇందులో భాగంగా తన కుటుంబ సభ్యుల పేర్లను ఫోన్లో ఎలా ఫీడ్ చేసుకుని ఉన్నారో చెప్పాలని చిరంజీవిని అడిగింది.
దీనికి సమాధానంగా సురేఖ పేరును రే అని ఫీడ్ చేసుకున్నానని మెగాస్టార్ చెప్పడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఆ తర్వాత రామ్ చరణ్ పేరును ఏమని సేవ్ చేసుకున్నారని అడిగితే.. చెర్రీఅని సమాధానం ఇచ్చారు. ఇక చివరగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు అడగగా.. అందరూ పీకే అని అంటుంటారు కానీ నేను మాత్రం కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక చిరంజీవి తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఆయనను బాగా మిస్ అవుతున్నామని అన్నారు. అయితే ఆ వీడియో పాతదే అయినప్పటికీ సామాజిక మాధ్యమాల్లో తిరిగి వైరల్ అవుతోంది.